Suryaa.co.in

Telangana

పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌ కుమార్‌గౌడ్‌
-టీడీపీతోనే తెలుగువారికి గుర్తింపు
– మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య

హైదరాబాద్ : జాతీయ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘనస్వాగతం పలకడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొత్తేమీకాదు.

నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా పని చేశారు. ఏనాడూ కక్షపూరిత రాజకీయాలను చేయలేదు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని కానీ, పోటీపడిన ఇతర నాయకులను గానీ చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూశారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సమిష్టిగా పని చేసి, పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం. 2028 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తాం. తెలుగుదేశం పార్టీ మద్దతు లేనిదే రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోదు.

మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య మాట్లాడుతూ.. తెలుగు ప్రాంతాలను, ప్రజలను అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో విప్లవాత్మకమార్పులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు కి స్వాగత కార్యక్రమంలో రోడ్డుపైన వస్తున్న ప్రజలు, డ్రైవర్లు కూడా పాల్గొని విజయవంతం చేశారు.

విలేకరుల సమావేశంలో తెలంగాణ ఇన్చార్జి, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌రావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీర రాజునాయక్‌, షేక్‌ ఆరిఫ్‌, కూరపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి బుగిడి అనూప్‌ కుమార్‌ కూడా పాల్గొని మాట్లాడారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి డా॥ ఏ.ఎస్‌. రావు, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE