Suryaa.co.in

Andhra Pradesh

సాగు మోటార్లకు మీటర్ వల్ల కలిగే లబ్ధిని రైతులకు వివరించాలి: సీఎం జగన్

అమరావతి: సాగు మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల కలిగే లబ్ధిని రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.విద్యుత్‌ రంగంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని రైతులకు తెలియజేస్తూ ఈమేరకు లేఖలు రాయాలని పేర్కొన్నారు. పంపుసెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
థర్మల్‌ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని ఆదేశించారు. డిమాండ్‌ ఉంటే పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్‌లు నడిచేలా చూడాలన్నారు. ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూడాలని, సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి మెరుగ్గా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE