Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ సహకారంతో 75 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ

– స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న మంత్రి నారా లోకేష్
– శిక్షణ పొందిన “69”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ
– కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు

మంగళగిరి : మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 75 మంది మహిళలకు మంగళవారం ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు.

69వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు అందజేశారు. మంత్రి నారా లోకేష్‌కు ల‌బ్దిదారులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ అందిస్తున్న కుట్టుమిషన్లతో నియోజకవర్గంలోనే ఎన్ని కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధితోనే సమాజ ప్రగతి సాధ్యమని భావించిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 96.40 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, పట్టణ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు సింహాద్రి బేబీ రాణి, పట్టణ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వాసా పద్మ, మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఎలమంచిలి పద్మజ, పట్టణ తెలుగు మహిళా కార్యదర్శి ఉడత లావణ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE