– రేవంత్ రెడ్డి రండ కాకపోతే, మొగోడే అయితే వడ్లకు ఎంత బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి
– సాయంత్రం వరకు చెప్పకపోతే రేవంత్ రెడ్డిని రండ అనే పిలుస్తా
– తెలంగాణకు ఎప్పటికి కాంగ్రెస్ పార్టీనే విలన్
– కేసీఆర్ ఏ టైమ్ కు ఎట్లా రావాలో అసెంబ్లీకి వస్తారు
– ప్రభుత్వ ఆదాయాన్ని పందికొక్కుల్లా తింటున్నారు
– కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే హుజూర్ నగర్ కు నీళ్లు ఇస్తాం
మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క చెప్పాలి. ఎన్ని వడ్లు కొన్నారు? ఎంత బోనస్ ఇచ్చారో చెప్పాలి. చెప్పకపోతే మీరు రండలు. రేవంత్ రెడ్డి రండ కాకపోతే, మొగోడే అయితే.. ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో, ఎంత మంది రైతులకు డబ్బులు వేశారో, వడ్లకు ఎంత బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి. సాయంత్రం వరకు చెప్పకపోతే రేవంత్ రెడ్డిని రండ అనే పిలుస్తా.
ఎల్కతుర్తి లో బిఆర్ఎస్ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం భాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవడం లేదు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్. తెలంగాణ పేరు ఎత్తితే వాళ్ళను నక్సలైట్ల పేరుతో కాంగ్రెస్ కాల్చి చంపింది.
చంద్రబాబు చేతిలో నడ్డి విరిగిన కాంగ్రెస్, 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
టీఆర్ఎస్ పెట్టించింది. కేసీఆర్ తిడుతున్న వాళ్ళు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద ఉన్నారు. తెలంగాణకు ఎప్పటికి కాంగ్రెస్ పార్టీనే విలన్. కాంగ్రెస్ పార్టీ పేరు
విలన్ గానే తెలంగాణ చరిత్రలో ఉంటుంది 16 నెలల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వచ్చాయి. ఒక్క ఏడాదిలోనే గురుకుల పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపాలి.
కేసీఆర్ మీద ఎందుకు ఏడుస్తున్నారు? కేసీఆర్ మీకు సంవత్సరంన్నర
సమయం ఇచ్చారా? ఎన్.డి.ఎస్.ఏ ఇచ్చిన రిపోర్ట్ నిజం అని నిరూపించు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని మీరు,ప్రజలు ఎదురుచూశారు. అసెంబ్లీలో పిల్లల్ని ఏం పీకలేకపోతున్నారు. అవతలి టీమ్ బలహీనంగా ఉందని పిల్లల్ని అసెంబ్లీకి పంపుతున్నారు. కేసీఆర్ ఏ టైమ్ కు ఎట్లా రావాలో అసెంబ్లీకి వస్తారు.
ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని జీవో ఇచ్చారు. 41 వేల కోట్లు రుణమాఫీ అని చెప్పి 21 వేల కోట్లు చేశామని చెప్పారు. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి అయిందని అంటున్నారు. బిఆర్ఎస్ సభను చూసి లాగులు తడుపుకుంటున్నారు. పిచ్చి పట్టినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా? హామీలు ఇచ్చినందుకు తప్పు అయిందని తెలంగాణ ప్రజల కాళ్ళు పట్టుకోండి.
పైసలు లేవని ఏడుస్తున్నారు. దేశాన్ని 50 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ నేతలు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు? అందుకే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పందికొక్కుల్లా తింటున్నారు. రాష్ట్ర ఆదాయం 15వేల కోట్లు తగ్గింది. మాకు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ కు నీళ్లు ఇస్తాం.
ఎన్.డి.ఎస్.ఏ నివేదిక కాదు. ఎన్డీఏ నివేదిక…ఎన్డీఏలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ కౌంటర్లు జరగలేదు. ఓట్ల రాజకీయం చేసేది బీజేపీ. కర్రె గుట్టల్లో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి.
కేసీఆర్ ప్రసంగంలో పస లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు? కె.ఆర్.ఎం.బి లో
మనకు వచ్చే నీళ్ల వాటాను వాడుకునే దమ్ము ప్రభుత్వంకు లేదు. 130 టీఎంసీల నీళ్లు ఏపీ ప్రభుత్వం తీసుకుపొతే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో ఎప్పుడైనా మోదీ మాట్లాడించారా? బిఆర్ఎస్ సభకు పల్లీలు అమ్ముకునే
అంత జనం కాంగ్రెస్ ళ్లకు వచ్చినా చాలు. కేసీఆర్ లాగా ఒక్కరే మాట్లాడే సభను కాంగ్రెస్ నేతలను పెట్టమనండి.
ప్రెస్ మీట్ లో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ,మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత ,భాస్కర్ రావు ,గాదరి కిషోర్ కుమార్ ,రవీంద్ర కుమార్ ,భూపాల్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేతలు మల్లికార్జున్ రెడ్డి ,కడారి స్వామి యాదవ్ పాల్గొన్నారు.