Suryaa.co.in

Telangana

పోలవరంకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు?

– ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు విజిట్ చేయలేదు?
– మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదు
– అప్పుడు రాంగ్ అయ్యింది, ఇప్పుడు రైట్ ఎట్ల అయ్యింది?
– సిగ్గులేదు.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటరు ఉత్తం?
– సర్వే మొబిలేజేషన్ అడ్వాన్స్ పేరిట 1426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు
– వ్యాప్కోస్ మేడిగడ్డ వద్ద కట్టాలని చెబితే, కట్టినం
– కొడంగల్ నారాయణ్ పేట్ లిఫ్టుకు ఇప్పటి వరకు డిపిఆర్ ఉందా?
– తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: పోలవరం కడుతున్న ఎన్డీఎస్ఏ నే, డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కుప్ప కూలింది. ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు విజిట్ చేయలేదు? అన్ని ప్రాజెక్టులకు రూల్ ఒకే విధంగా ఉండాలి. నాలుగైదు ఏండ్లు అయినా పోలవరంకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? పోలవరం అథారిటీ చైర్మన్ గా పని చేసిండు, ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్.. పోలవరం కడితే కుప్ప కూలింది. 9500 కోట్లతో కట్టాల్సిన పోలవరం 95వేల కోట్లకు పెరిగింది.

ఉత్తం ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకొని, అదే పాత చింతకాయ పచ్చడి లాగా రాజకీయం ప్రసంగాన్ని కొనసాగించిండు. అదే పాత రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారు ఉత్తం . ఉనుక మీద రోకలోలె దుంకులాడుడే తప్ప, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, సారం లేదు. ఊక దంపుడు ప్రసంగంతో జర్నలిస్టుల సహనానికి పరీక్ష పెట్టిండు. ఈ మాత్రం దానికి రెండు సార్లు ప్రెస్ మీట్ ప్లేస్ మార్చారు, మూడు సార్లు టైమింగ్స్ మార్చారు. తీరా చూస్తే ఈ సారి కూడా ఉత్తం ప్రిపేర్ అయినట్లు లేరు.

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక ఎల్లెంకల పడ్డరు. ఎంత దారుణం అంటే, ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్ సభలో వ్యతిరేకించింది ఇదే ఉత్తం కుమార్ రెడ్డి . అప్పుడు ’ఇట్స్ అన్ కానిస్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచెమెంట్ అపాన్ స్టేట్ రైట్స్‘ అన్నరు. బిఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా కనపడుతున్నది. అప్పుడు రాంగ్ అయ్యింది, ఇప్పుడు రైట్ ఎట్ల అయ్యింది.

మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదు. అవినీతి జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొనకున్నా, పేర్కొన్నట్లు చెప్పడానికి ఉత్తం కుమార్ రెడ్డి ప్రయాస, ఆపసోపాలు చూస్తే జాలి కలిగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బిఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అయ్యింది. కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ కకావికలం అయ్యింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టుతో వచ్చారు. లేనిపోని అబద్దాలు చెప్పారు.

ఉత్తం ఎన్డీఎస్ఏ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ లెక్క చెబుతున్నరు. ఎన్డీఎస్ఏను ఈడీ, సీబీఐ లెక్క వాడుతున్నరు. కాంగ్రెస్, బిజేపీ కుమ్మక్కై చేస్తున్న పని ఇది. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముంది ఉత్తం? తమ్మిడిహెట్టికి ఎందుకు అనుమతులు తేలేదు అన్నరు. మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎందుకు తమ్మిడిహెట్టికి అంతర్ రాష్ట్ర ఒప్పందం చేయలేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా?

మీరు పెట్టిన ఖర్చు వృథా అవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించిండు. కమిషన్ల కోసం, పర్సంటీజీల కోసం టెండర్లు పిలిచి, ఎక్కడో చేవెళ్ల కాడ తవ్వారు. నీళ్లు తీసేకాడ తవ్వరు, ఎక్కడో పోయి తవ్వుతారు. తప్పు చేసింది మీరు, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం. వైఎస్ ప్రభుత్వం 2008లో శంఖుస్థాపన చేశారు. 4 ఏళ్లలో పూర్తి అవుతుంది అన్నరు. ఏడేండ్లు అధికారంలో ఉండి కనీసం అంతర్ రాష్ట్ర ఒప్పంద చేయలేదు

సిగ్గులేదు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటరు ఉత్తం? సర్వే మొబిలేజేషన్ అడ్వాన్స్ పేరిట 1426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. 160 కోట్ల ల్యాండ్ అక్వెజనీషన్ కోసం ఖర్చు చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట. కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు, ఆ దోపిడిలో ఉత్తం ఉన్నరు. ఆనాడు మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నరు. ఈ తప్పును సరిచేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నరు.

బిఆర్ఎస్ పార్టీ అన్యాయంగా తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు అన్నడు. మీరు 8 ఏళ్లలో ఎందుకు పర్మిషన్ తేలేదు? ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ లో చర్చలు జరిపాం, కేసీఆర్ మాట్లాడారు. నేను వెళ్లి ముషారఫ్ అనే ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపాం. ఎంత డబ్బు అయినా ఇస్తం, తమ్మిడిహెట్టి వద్ద అనుమతి ఇవ్వాలని అడిగాం. అంత ఎత్తుమీద ఒప్పుకోము అని స్పష్టంగా చెప్పారు.

ఉత్తం చదువుకున్న వారు, మినిమం ఎథిక్స్ ఉంటాయి అనుకున్నా. విజ్ఞానంతో కాడు, అజ్ఞానంతో మాట్లాడాడు. అక్కడ నీళ్లు లేవు అని సిడబ్ల్యుసి చెప్పింది. పది సార్లు చెప్పాం. నీ మాటలు వెంటే ప్రజలు నవ్వుతారు ఉత్తం గారు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి మొదలు నుంచి కంటిన్యూయస్ గా మహారాష్ట్రతో చర్చలు జరుపుతూనే ఉన్నం. తుమ్మిడిహెట్టి వద్ద 160 టిఎంసీల నీళ్ళు ఉండవు అని లెటర్ రాసింది. మరో లెటర్ లో భవిష్యత్తులో నీటి లభ్యత ఉండదు అని చెప్పింది. రెండు సార్లు సిడబ్ల్యుసి ఉత్తరాలు రాసింది.

మేము ప్రయత్నాలు చేసినం, కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అనడంతో తుమ్మడి హెట్టి నుంచి వేరే చోటుకు తప్పని పరిస్థితిలో మార్చాం. నీళ్లు ఉన్న చోట్ల మేడిగడ్డ వద్దకు మార్చాం. ప్రత్యామ్నాయం కూడా మేం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ వద్ద కట్టాలని చెబితే, కట్టినం. 220 టీఎంసీల నీళ్లు తీసుకునే అనుమతి సిడబ్లుసి నుంచి సాధించినం.

ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది అంటున్నారు. 16 నుంచి 141 టిఎంసీలకు సామర్థ్యం పెంచింది. ఆయకట్టు రెండింతలైంది. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టిఎంసీలకు పెంచినం. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని మార్చినం.
2007లో 17, 800 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల కడుతాం అన్నరు, ఒక్క ఏడాదిలోనే 38,500 కోట్లు అన్నరు. పన్నెండు నుంచి పదహారు లక్షలకు ఆయకట్టు పెరిగింది.
మరి మేం ఎంత ఆయకట్టు పెంచినం? ఎంత నిల్వ సామర్థ్యం పెంచినం?పెరగదా ప్రాజెక్టు కాస్ట్? భూసేకరణ ఏకరానికి 8 నుంచి 11 లక్షలు ఇచ్చినం భూసేకరణ పెరగదా?

డీపీఆర్ నాలుగు నెలల్లోనే తయారు చేసిండు అని ఉత్తం అంటున్నడు. కొడంగల్ నారాయణ్ పేట్ లిఫ్టుకు ఇప్పటి వరకు డిపిఆర్ ఉందా? టెండర్లు పిలిచి, ప్రాజెక్టు కడుతున్నవు, సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాధానం ప్రకారం, కొడంగల్ ప్రాజెక్టుకు ఇప్పటికీ డిపీఆర్ లేదు. అయినా టెండర్లు పిలిచారు, పనులు ప్రారంభించారు. మిస్టర్ ఉత్తం.. మీకో నీతి మాకో నీతా? 2007 ప్రాణహితకు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, వేలకోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారు. 2010లో డీపిఆర్ సబ్‌మిట్ చేసారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవు ఉత్తం కుమార్ రెడ్డి. నీ వీపు చూసుకో ముందు.

ఆర్ఇసి దగ్గర అప్పు తెచ్చినం అంటున్నరు. మీ లాగా 170 కోట్లు బ్రోకర్ గా ఇచ్చి అప్పులు తేలేదు. బ్రోకర్ కు పైసలు ఇచ్చి, హెచ్ సీ యూ భూములు కుదువ పెట్టి పదివేల కోట్లు తెచ్చినవు. మేం తప్పు చేస్తే మాకు కేంద్ర ప్రభుత్వం ఎలా అప్పు ఇచ్చింది? లంచం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్, సిగ్గులేదు, అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కారు రేవంత్ సర్కారు ఇంతకంటే దివాళాకోరు తనం, దిక్కుమాలిన తనం ఉండదు.

అన్నారం, సుందిళ్ల లొకేషన్ మారింది. నిజం మేం కాదన్నమా? ఆల్ జియలాజికల్ సర్వే ప్రకారంగానే మారింది. మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థానం మారలేదా? ఏలేశ్వరం నుంచి నంది కొండకు మారలేదా? ఎస్సారెస్పీ ప్రాజెక్టు కుస్తాపురం నుంచి పోచంపాడుకు మారలేదా? పరిస్థితులు, ముంపు, అవసరాలను బట్టి మారుతాయి. అది కూడా హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది. మాట్లాడితే పచ్చి అబద్దాలు.

అన్ని రకాల టెస్టులు జరిగాకే, డిజైన్లు ఆధారంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. లక్షల కోట్లు నష్టం జరిగింది ఎట్ల, బిఆర్ఎస్ హయాంలో మొత్తం ఖర్చు కాలేదు.
కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 231 కిలో మీటర్ల గ్రావిటి కెనాల్, ఇవన్నీ బాగున్నయి. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ సహా నుంచి ఇప్పటికీ సాగు నీళ్లు వస్తున్నాయి. ఇవి కాళేశ్వరంలో భాగం కాదా? మరి లక్ష కోట్లు వృథా అయితే నీళ్లు ఎట్ల వస్తున్నయి?

తొందరగా మేడిగడ్డను రిపేర్ చేయండి. 2014 దాకా ఎందుకు? తుంగతుర్తి, కోదాడకు నీళ్లు రాలేదు ఉత్తం కుమార్ రెడ్డి? మేడిగడ్డ ద్వార నీళ్లు తెచ్చి మిడ్ మానేర్ ద్వారా నీళ్లు తెచ్చినం. ఫై మెన్ కమిటీ మేడిగడ్డ నుంచి నాట్ ఫీజబుల్ అని చెప్పలేదు. డైరెక్ట్ గా మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదన్నది.
అందుకే అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చినం. వానాకాలం 153లక్షల మెట్రిక్ టన్నులు పండితే, ఎందుకు 53లక్షల మెట్రిక్ టన్నులే ఎందుకు కొన్నరు. మరి ఎందుకు కొనుగోళ్లు తగ్గింది?

రెండు టింఎంసీ కంటే పెద్ద బ్యారేజీలు ప్రపంచంలోనే కట్టలేదు అన్నడు. మన దేశంలో ఫరక్కా బ్యారేజ్ 30 టిఎంసీలతో అద్బుతంగా పని చేస్తున్నది. దాని డెట్ స్టోరేజీ 7 టీఎంసీల, మన మొత్తం కెపాసిటీ 7 టిఎంసీ. ఉత్తం కుమార్ గొప్పలు చెబుతున్నరు. తమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్చు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ లో తుమ్మల, ఈటెల, నేను సంతకం చేసినం.

మీ కొలీగ్ తుమ్మల గారిని అడగండి. సంతకం కూడా పెట్టిన్రు. ఎన్డీఎస్ఏ రిపోర్టుతో అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి. దుర్మార్గంగా, అరాచకంగా దుష్ప్రచారం చేసారు. బురదజల్లే ప్రయత్నం చేసిండు. మీ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది ఎన్డీఎస్ఏ. బ్లాక్ 7 తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డను ఉపయోగంలోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఖర్చు చేసింది 90వేల కోట్లు అయితే, లక్షల కోట్లు అని ఉత్తం అంటడు. రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయకండి
ఉత్తం గారు.. రాజకీయాలు ఆరు నెలల ముందు చేద్దాం.

నిజాయితీగా పని చేయండి, అబద్దాలు, అసత్యాలు ఇంకెంత కాలం చెబుతారు? ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తమన్నరు, ఆరువేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. పెద్దవాగు తెగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్ప కూలిండి. వట్టెం వాగు కొట్టుకుపోయింది. సత్యహరిశ్చంద్రుడి లెక్క మాట్లాడుతున్నవు. ఏడాదిన్నర పాలనలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చినవు.
అసెంబ్లీని కూడా తప్పు దోవ పట్టినవు.

తెలంగాణ నీటి పారుదల శాఖ ఎంత దీన స్థితిలో ఉందంటే, 30 ఇఎన్సీ, సీఈ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీ, 57 సూపరింటెండ్ ఇంజినీర్ల పోస్టులకు గాను 40 ఖాళీ ఉన్నయి. సెక్షన్ 3 నదీ జలాల మీద ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతుంటే, పూర్తి స్థాయి సీఈ, ఎస్ ఇ లేడు. డిప్యూటీ ఇఇ, మాత్రమే హాజరవుతున్నడు. వారికి ఫ్లైట్ చార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద క్యాబినెట్ లో కాకుంటే ఏఐసీసీలో చర్చించు. మేం భయపడం. తమ్మిడిహెట్టి దగ్గర కట్టి తీరుతా అన్నడు, ఏడాదిన్నర అవుతున్నది. తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఇప్పటికైనా మేడిగడ్డను రిపేర్ చేసి, రైతులకు న్యాయం చేయిండి.

LEAVE A RESPONSE