Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దగ్దం

చంద్రబాబు నాయుడుపై ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో మాధవ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సంధర్బంగా విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ……మాధవ్ లాంటి వ్యక్తి ఎంపీగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమన్నారు. మాధవ్ వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు భద్రతపై మాకు ఆందోళనగా ఉందన్నారు.

మహిళలతో అసభ్యంగా వీడియో కాల్స్ మాట్లాడించిన మాధవ్ ని ఇంకా పార్టీలో కొనసాగిస్తున్నారంటే.. ఆ పార్టీ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్దమౌతోందన్నారు. మహిళలను అత్యాచారాలు చేసి పసిబిడ్డను గొంతు నులిమి చంపిన నీ నీచుడు గోరంట్ల మాధవ్. ప్రజల వలసలపై దృష్టి పెట్టకుండా నోటి క్యాన్సర్ వచ్చినవాడిలా మొరుగతున్నావు. ఇటీవల బెంగుళూరులో ప్రమాదం జరిగి గోరంట్లకు చెందిన 13 మంది వలస కార్మికులు చనిపోతే కనీసం వారికి పరిహారం అందించాలన్న ఆలోచన నీకు కలగకపోవడం శోచనీయం.

సీఐగా ఉండి ఎన్నో అక్రమాలకు పాల్పడి పోగేసుకున్న సొమ్ముతో ఎంపి అయ్యావు. కనీసం ఇప్పుడైనా ప్రజల కోసం సేవ చేసుకునేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడితే నోటికి వాతలు పెడతామని గోరంట్ల మాధవ్ గ్రహించాలని గోనుగుంట్ల కోటేశ్వరరావు హెచ్చరించారు.

LEAVE A RESPONSE