Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరులో క్యాంపు కోర్ట్ నిర్వహించుటకు విచ్చేసిన హెచ్.ఆర్.సి చైర్మన్

మానవ హక్కుల ఉల్లంఘన మరియు పరిరక్షణకు సంబంధించిన కేసుల విచారణ కోసం గుంటూరులో క్యాంపు కోర్ట్ నిర్వహించుటకు సోమవారం ఉదయం రోడ్లు మరియు భవనాల అతిధి గృహానికి విచ్చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తిని జిల్లా సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్, నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి, గుంటూరు రెవిన్యూ డివిజన్ అధికారి ప్రభాకర రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూధనరావు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో చైర్మన్ తో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులు దండే సుబ్రహ్మమణ్యం ( జ్యుడిషియల్ ), డా. గోచిపాత శ్రీనివాసరావు ( నాన్ జ్యుడిషియల్ ) పాల్గొన్నారు.

LEAVE A RESPONSE