– సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని సైలెన్స్
– ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలి
– అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్
– త్రీడీ ఫార్ములాని అమలు చేస్తుంది కేడి ముఖ్యమంత్రి
– అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదు ?
– ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుంది
– సివిల్ సప్లైస్, అమృత్ కుంభకోణాలపై కేంద్రం ఎందుకు స్పందించలేదు?
– తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్
హైదరాబాద్: పసలేని కేసులు పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుంది. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా. ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సస్పెండ్ చేస్తాను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. మరి ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు?
వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచాడు. వాళ్లతో డబ్బులు తీసుకున్నాడని అనుమానం ఉంది. అనుచిత లబ్ధి పొందింది ఫార్ములా ఈ సంస్ధ వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు? ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అదానీతో కాంటాక్ట్ రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి, ఫార్ములా ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నాడు. దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నద? ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి. కానీ అవినీతి కేసులు అని పెట్టడం వృధా.
హైదరాబాద్ పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు, హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదు. ఒక పైసా అవి జరగలేదు కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం లో మరిన్ని విషయాలు చెప్పలేను.
ఏసిబి ఎఫ్ఐఆర్ ని కొట్టివేయలని హైకోర్టులో కేసు నమోదు చేశాను. అయితే ఇదే అంశం పైన ఇది ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఏం జరుగుతుందన్నది చూడాలి.
ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలి. అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదు ముఖ్యమంత్రి చెప్పాలి. నా పైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిండు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎట్లా వచ్చినయో చెప్పాలి.
అనుమానాలపైన కేసులు ఉండవు. కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్దాలను అసత్యాలను మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తుంది. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని, ముఖ్యంగా రుణమాఫీ రైతు భరోసాను ప్రజలకు ఇవ్వలేకపోయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవైపు రైతు భరోసాను ఎత్తకొట్టడం.. బీసీలను మోసపుచ్చడం అనే రెండు ప్రయత్నాలతో నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుంది. ఎవరికి రైతు భరోసా ఇస్తారు అని విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఎవరు పంట వేస్తున్నారు ఎవరు గుర్తుపట్టి రికార్డులకెక్కిస్తారు?
బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతున్నది. కోర్టు కేసులపేరు చెప్పి బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషను ఆపే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ బిడ్డ పి వి కి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం.
డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ డైవర్షన్ (3D) ఇదే త్రీడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైడ్రా పేరుతో విధ్వంసం… అటెన్షన్ డైవర్షన్ ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. ఈ త్రీడీ ఫార్ములాని అమలు చేస్తుంది కేడి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అల్లుడి కోసం, అన్నదమ్ముల కోసం బావమరిది కోసం పనిచేసేది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సప్లై కుంభకోణం అమృత్ టెండర్ల కుంభకోణం మంత్రులపై పొంగులేటి పై జరిగిన ఈడి దాడి వంటి అంశాల నుంచి బిజెపి ప్రభుత్వం కాపాడుతుంది
కచ్చితంగా బిజెపి పార్టీ బిజెపి పార్లమెంటు సభ్యులు, బిజెపి కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డికి రక్షణ గోడ లెక్క నిలబడ్డారు. మేము లేవనెత్తిగా సివిల్ సప్లైస్, అమృత్ కుంభకోణాలపై కేంద్రం ఎందుకు స్పందించలేదు? పొంగులేటి ఇంటి పైన జరిగిన ఈడి దాడుల పైన ఎందుకు స్పందించలేదనే రాష్ట్ర ప్రజలకు తెలియ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల్లో బిజెపి పార్థ పరోక్షంగా ఉన్నదని అర్థమవుతుంది.
2025 సంవత్సరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం. ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది.
సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నాడు
కొంత ప్రచారం కావాలి. ప్రజా సమస్యల పై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్ళ పైన రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు… ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి
వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు .కుటుంబాలు కాదు. మనుషులు కాదు అన్నట్టు.. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నాడు. సినిమా వాళ్ళతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలి. వీళ్ళకి కూడా కనీసం 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.