Suryaa.co.in

Telangana

కాంగ్రెస్, జేడీఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే

-కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం
-బీజేపీ సింహం… సింగిల్ పోటీ చేస్తోంది
-మెజారిటీ సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం
కర్నాటక బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బాగేపల్లి బస్టాండ్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.
• బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, బాగేపల్లి బీజేపీ అభ్యర్థి మునిరాజుతో కలిసి బాగేపల్లి నేషనల్ కాలేజీ నుండి బస్టాండ్ దాకా ర్యాలీ
• బండి సంజయ్ రోడ్ షోకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు…
• బీజేపీ అభ్యర్ధికి ఓటేయాలని అభ్యర్ధిస్తూ… ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచార రథంలో బండి సంజయ్
• బాగేపల్లి బస్టాండ్ సెంటర్లో బండి సంజయ్

కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను పెంచే కుట్ర జరుగుతోందన్నారు.

కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఈరోజు గౌరిబిదనీరు, బాగేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డి.పాళ్యలో ఓటర్ల వద్దకు వెళ్లి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు.. అందులోని ముఖ్యాంశాలు..
కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కర్నాటకలో ప్రజల బతుకులు ఆగమవుతాయి. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచే ప్రమాదం ఉంది.

కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు. నిధులెక్కడి నుండి తెస్తారు? కాంగ్రెస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే.. కర్నాటకలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాబోతున్నయ్. మళ్లీ అదికారంలోకి రాబోతున్నం. కాంగ్రెస్, జేడీఎస్ ఎంత డబ్బు వెదజల్లినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరు. కర్నాటకలో కాంగ్రెస్, ‌జేడీఎస్ పార్టీలు కలిసి గుంటనక్కల్లా పోటీ చేస్తున్నయ్…. బీజేపీ సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేస్తుంది. మళ్లీ అధికారం తథ్యం.

LEAVE A RESPONSE