Suryaa.co.in

Telangana

కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారు

-కవిత పుట్టకముందే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారు
-సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీలో కేసిఆర్ చెప్పారు
-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

నిన్న కవిత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు అంత ద్రోహులు అని అనడం చరిత్రను వక్రీకరించడమే.సోనియా గాంధీ దయ వల్లనే వచ్చింది అని అసెంబ్లీలో కేసిఆర్ చెప్పారు.రాజకీయ భాగాలు అనుభవిస్తున్నది మీరు.తెలంగాణ కాంగ్రెస్ నష్టపోతుంది అని తెలిసి కూడా ఇచ్చారు.

కవిత పుట్టకముందే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారు.బతుకమ్మ, వంటావార్పు చేస్తే తెలంగాణ వచ్చింది అని అనుకుంటున్నారు.తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డరు రాష్ట్రంలో.కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారు.తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంతా?.చర్చకు వస్తారా.

అసైన్డ్ భూములు కూడా వదలడం లేదు.హైదరాబాద్ చుట్టూ ఉన్న 80 శాతం భూములు మీ చేతుల్లో ఉన్నాయి.తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల పరిస్తితి ఏంటి అని ఒక్కసారి అయినా ఆలోచించారా?ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న 80 శాతం మంది ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన వల్లే.

మీరు చేసిన ఘనకార్యం రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పులు చేశారు.తెలంగాణ వచ్చిన ప్రజల బతుకులు మారలేదు.మీ కుటుంబ సభ్యుల బతుకులు బంగారం అయ్యాయి.ధరణి వల్ల ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే పరిస్తితి వచ్చింది.పోడు భూముల సమస్యల వల్ల శ్రీనివాస్ అనే FRO అధికారి చనిపోయే పరిస్తితి వచ్చింది. కవిత తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు.

LEAVE A RESPONSE