– బౌద్ధం ఈ దేశానికి అరిష్టం
మనదేశ సామాజిక ఐక్యతను, దేశ సనాతనత్వాన్ని, పెద్ద శాతం దేశ ప్రజల్ని ‘సాంస్కృతిక అనాధల్ని చెయ్యడానికి’, భ్రష్టుల్ని చెయ్యడానికి పలు కుట్రలు జరిగాయి అని ఇవాళ్టి రోజున చదువు, పరిశీలన ప్రాతిపదకన అవగాహనవస్తోంది. ‘బుద్ధుడు, బౌద్ధము, అశోకుడు భారత దేశ సనాతనం లేదా వైదికతను దెబ్బకొట్టే కుట్రలో ప్రధానాంశాలు అయ్యాయి’ అనీ అవగతం ఔతోంది!
మౌలికంగా వైదిక దేశమైన మనదేశాన్ని ఇతర మతాలతో పాటు బౌద్ధంతో కూడా దెబ్బకొట్టే లేదా దేశ ప్రజల్లో హిందూత్వాన్ని పలచబరిచే లేదా దేశ మూల వాసులైన హిందువుల్ని బలహీనపరిచే లేదా సనాతన దేశానికి ఇతర మతాలతో పాటు బౌద్ధాన్ని కూడా బలవంతంగా పులిమే ఒక భయంకరమైన కుట్రలో భాగమే మనదేశ పతాకంలో అశోక చక్రం చొప్పించబడింది అన్న ఆలోచన కలుగుతోంది. తప్పులేదు సరైన ఆలోచనతో ఈ విషయంగా సరైన, మేలైన అవగాహనకు వద్దాం.
నిజానికి ఈ అశోక చక్రం అన్నది ‘ధర్మ చక్రం’గా బౌద్ధానికి, అశోకుడికి, బుద్ధుడికి ఎంతో పూర్వమే వేద కాలం నుంచే సనాతనంలో ఉంది. (అంతర్జాతీయ అధ్యయనానికి విరుద్ధంగా వేదాలు బుద్ధుడి తరువాతే వచ్చాయి అని పేలాపన చేసే విదూషకత్వాన్ని, విద్వేష వాదాన్ని ఒక మానసిక రుగ్మతగానే పరిగణించాలి) బుద్ధుడు బోధిని పొందిన తరువాత చేసిన తొలి ప్రవచనం ‘ధర్మ చక్ర ప్రవర్తన’గా ప్రసిద్ధం. అశోకుడు ధర్మచక్రాన్ని తన చిహ్నంగా ఉపయోగించుకున్నాడు. కాలక్రమంలో ఈ ధర్మచక్రం అశోక చక్రం అయి బౌద్ధ చిహ్నంగా కూడా అయిపోయింది. అది మనదేశ జాతీయ పతాకంలో ఒక బౌద్ధ చిహ్నంగానే చొప్పించబడింది. అశోకుడికి పూర్వమే ఉన్న ధర్మ చక్రాన్ని అశోక చక్రంగా ప్రచారం చెయ్యడమే, స్థిరపరచడమే కుట్ర అని తెలుసుకోవచ్చు.
మొదట్లో మన జాతీయ పతాకంలో అశోకుడి ధర్మ చక్రం లేదు. 1947లో ఆధికారికంగా నిర్ణయించబడే చివరి దశలో నెహ్రూ ఈ అశోక చక్రాన్ని జాతీయ పతాకంలో చేర్చాడు. నెహ్రూ హైందవ వ్యతిరేక ప్రవర్తన, ఆలోచనలు, ఆచరణలు, నిర్ణయాలు ఇవాళ్టి రోజున మనకు తేటతెల్లం ఔతూనే ఉన్నాయి. ప్రాకృతిక సనాతనం లేదా వైదికత నుంచి దేశాన్ని, హిందువుల్ని దూరం చేసే పన్నాగం దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ ఊపందుకుంది అన్న వాస్తవం సరిగ్గా గ్రహించబడాలి.
బుద్ధుడికి, బౌద్ధానికి, అశోకుడికి మనదేశంలో ఇంగ్లిష్ పాలన కాలం వరకూ ప్రాముఖ్యత, కనీస పరిగణన లేవు. ముస్లీమ్ పాలన కాలం వరకూ ఎలా అయితే ‘ఆర్య ఆక్రమణ’ అన్న అసత్యం చలామణిలో లేదో ఆ విధంగా మనదేశంలో బుద్ధుడు, బౌద్ధం, అశోకుడు పరంగా ఇవాళున్న అసత్య అనర్థం ముస్లీమ్ పాలన కాలంలో లేదు.
‘ఇంగ్లిష్ పాలన మన దేశంలో వ్యాపింపజేసిన వ్యాధులు ఆర్య సిద్ధాంతం, బౌద్ధం, అశోకుడు’ అని గ్రహించాల్సిన అత్యవసర స్థితిలో ఇవాళ మనం ఉన్నాం.
మనదేశ సనాతనం లేదా వైదికతను, సామాజిక సామరస్యతను అతిభయంకరంగా దెబ్బకొట్టే పన్నాగంలో ప్రధానాంశంగా ‘ఆర్యుల రాక’ అన్న అంశంతో పాటు బుద్ధుడు, బౌద్ధం,అశోకుడు పరంగా అన్యాయమైన అబద్ధాలను వ్యాపింపజేసి భారత భూభాగానికి పెను హాని కలిగించారు.
బతికి ఉన్న కాలంలోనే బుద్ధుడికి జనాదరణ లేదు; జైనానికి ఉన్న వ్యాప్తి, జనాదరణ భారత భూభాగంలో బుద్ధుడికి, బౌద్ధానికి ఎప్పుడూ లేవు. (నా క్రితం వ్యాసాల్లో అంతర్జాతీయ అధ్యయన ఆధారాలతో ఈ సత్యాన్ని తెలియజేశాను) భారత ప్రదేశంలో సా.శ. 4వ శతాబ్దికే బౌద్ధం చచ్చిపోయింది. Rhys Davids తన Buddhsit India పుస్తకం (పేజ్ 318)లో ఈ వాస్తవాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజేశాడు. 4వ శతాబ్ది వరకూ కూడా బౌద్ధం పెద్ద శాతం ప్రజల మతం, అభిమతం కాలేదు. మనదేశంలో ఏ కాలంలోనూ జైనంలా, జైనం స్థాయిలో బౌద్ధం ఒక సంస్కృతి, మతం అన్న స్థాయికి రాలేదు!
అశోకుడు బుద్ధ ఉపాసకుడు అంతే. అశోకుడి కాలానికి బౌద్ధం అన్నది లేదు. అశోకుడు నుంచి 41యేళ్ల తరువాత బుద్ధ ఉపాసనకు రాజ ఆదరణ కూడా కూలిపోయింది. అశోకుడి మనుమడు సంప్రతి మౌర్యుడు జైనాన్ని రాజ మతంగా తీసుకున్నాడు. (నా క్రితం వ్యాసాల్లో అంతర్జాతీయ అధ్యయనంతో ఈ సత్యాన్ని నిరూపించాను)
“B.C.E. 3వ శతాబ్ది వరకూ బుద్ధుడి ఉనికి, మరణాలకు సాక్ష్యాధారాలు నమోదు కాలేదు” అని అంతర్జాతీయ చరిత్రకారులు
AK Coomaraswamy, I B Horner లు తమ GOTAMA THE BUDDHA పుస్తకం ద్వారా ప్రపంచమంతా తెలియజేశారు. (మనదేశంలో మాత్రమే ఆ చదువు లేదు)
‘భారత భూభాగంలో తొలి మతోన్మాద నరమేధం చేసిన వాడు అశోకుడు!’ అశోకుడు B.C.E. 265లో బుద్ధ ఉపాసకుడు అయ్యాడు. B.C.E. 270లో కళింగ యుద్ధం చేశాడు. అటు తరువాత ‘బుద్ధ ఉపాసకుడైన అశోకుడు’ ఆజీవిక, నిర్గ్రంథ (జైన) మతస్థుల్ని ఊచకోత కోయించాడు. ఆజీవిక మతాన్ని పూర్తిగా నిర్మూలించాడు అశోకుడు. అశోకుడు పనిమనిషి తిస్యను అనైతికంగా ఉంచుకుని కాపురం చేశాడు. అశోకుడి కొడుకు కూతురు మహింద, సంఘమిత్ర ఇద్దరూ అశోకుడి ఆధికారిక సంతానం కాదు; ఆ కారణంతో మహింద, సంఘమిత్ర ఇద్దరికీ రాజ్యాధికారం దక్కదు కాబట్టి వాళ్లు బుద్ధ ప్రచారకులుగా శ్రీలంక వెళ్లిపోయారు.
అశోకుడి ఉంపుడుగత్తె తిస్య అశోకుడి ఆధికారిక పుత్రుడు కునాలుడిని కామించింది. కునాలుడు తిరస్కరించడంతో ప్రణాళికాబద్ధంగా తిస్య ఆ కునాలుణ్ణి అంధుణ్ణి చేసింది. ఈ తిస్య బోధి వృక్షాన్ని కూడా పెకిలించేసింది. బుద్ధ ఉపాసనకు వంశ సహితంగా బలై నాశనమైన తొలి వ్యక్తి అశోకుడే!
అంబేడ్కర్ బౌద్ధాన్ని తీసుకున్న కొద్ది కాలానికే మరణించారు! ఆయన బౌద్ధాన్ని స్వీకరించకుండా ఉంటే మరి కొంత కాలం మనుగడ చేసేవారేమో? బుద్ధుడి మరణానంతర పరిణామల నుంచీ పరిశీలిస్తే బౌద్ధం ఈ దేశానికి అరిష్టం అన్న నిజం తెలియవస్తుంది. బుద్ధుడి చిత్ర పటాల్ని ఇళ్లల్లోనూ, వ్యాపార స్థలాల్లోనూ పెట్టుకునే వాళ్లు ఈ వాస్తవంపై దృష్టిపెట్టాలి.
‘అశోకుడు అత్యంత అనైతిక శక్తి’. అశోకుడికి సంబంధించిన సత్యాల వివరాలు, ఇంకా పలు వాస్తవాలు Charles Allen రాసిన ‘India’s Lost Emeperor’ పుస్తకంలోనూ,D.R. Bhandarkar రాసిన Ashoka పుస్తకంలోనూ, వేద్ వీర్ ఆర్య రాసిన The Chronology Of Ancient India పుస్తకంలోనూ ఇంకా బౌద్ధ భిక్షువులు పాలీలో రాసిన అశోక వదన, మహా వంశం, దివ్య వదన గ్రంథాల్లోనూ చెప్పబడ్డాయి. అశోకుడు, బుద్ధుడు, బౌద్ధం గురించి నిజాలు, సరైన అవగాహన కావాలంటే చదవాల్సింది రోమిలా థాపర్, డీ.డీ. కోసంబీ (కోశాంబి అనడం తప్పు), అంబేడ్కర్ రచనల్ని కాదు.
1. Geoffrey Parrinder 2. A k Coomara Swamy 3. I B Horner 4. Dwight Goddard 5. Denise Lardner Carmody & John Carmody 6. John Marshal (Archeologist) 7. Eric Seldeslachts 8. H. Bhattacharya 9. K.P. Jayaswal 10. Etinne Lamotte 11. D. Devahuti 12. R.C. Mitra 13. Paul Williams 14. Moriz Winternitz 15. Rhys Davids 16. H.C. Raychaudhri వంటి అంతర్జాతీయ చరిత్రకారుల ప్రామాణికమైన అధ్యయనాల్ని చదవి బుద్ధుడు, బౌద్ధం గురించి ‘చదువు ఆధారిత అవగాహన’కు రావాలి. ఈ విశ్వసనీయమైన చరిత్రకారుల అంతర్జాతీయ రచనల్ని చదివి ఉంటే అంబేడ్కర్ బుద్ధుడు, బౌద్ధం పరంగా సరైన జ్ఞానాన్నే తన అనుయాయులకు చెప్పి ఉండేవారు.
చరిత్ర ఆధారబద్ధంగా ఉండాలి; వ్యాఖ్యానబద్ధంగా ఉండకూడదు. కానీ ‘మనదేశంలో మాత్రమే’ బుద్ధుడి, బౌద్ధం, అశోకుడి చరిత్ర ఆధారాలు, విద్య లేని వ్యాఖ్యానబద్ధ చరిత్ర అయిపోంది. 10-35 (29+6=35) మార్క్స్ చదువు కాదు మనకు 100 మార్క్స్ చదువు ఉండాలి; కావాలి. 100 మార్క్స్ చదువుతో జరిగిన, జరుగుతున్న దేశ వ్యతిరేక కుట్రలను మనం గ్రహించాలి. 100 మార్క్స్ చదువుతో మనం మనదేశానికి ఉపయోగపడాలి.
అత్యంత క్రూరుడు, రాజ్యాధికారం కోసం తోబుట్టువుల్నే దారుణంగా చంపేసిన వాడు, వికృత స్వభావి, హింసావాది, మనదేశ తొలి మత నరమేధ కర్త అశోకుడు. ఆ అశోకుడి చిహ్నం, చిహ్నాలు మనకెందుకు? ఆ బౌద్ధ అశోకచక్రాన్ని దేశ జాతీయ పతాకంలో ఎందుకు చొప్పించడంలోని ఆంతర్యం ఏమిటి? ఇది ఏ కుట్రలో భాగం? మన సనాతనాన్ని కొందరు ఎందుకు నిర్మూలిద్దామనుకున్నారు? సనాతనాన్ని ఇంకా ఇంకా దెబ్బకొట్టాలని ఎందుకు, ఎందుకు నిరాఘాటంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి? మనదేశం విదేశీ మతాలకు, విదేశీ మతోన్మాదులకు, విదేశీ విధ్వంసక భావజాలాలకు, కుల కుట్రలకు బలి అవుతూనే ఉండాలా?
మన ఆలోచన, ఆచరణ, ప్రవర్తన, ప్రయాణం 100 మార్క్స్ చదువుతో ఉండాలి. విదేశీ మతోన్మాదులు, విదేశీ మత సంతుష్టీకరణలు, బుద్ధుడు, బౌద్ధం, అశోకుడు ఆధారిత కుట్రల నుంచి మనం మనదేశాన్ని కాపాడుకోవాలి. మనదేశానికి ఇవాళ కావాల్సింది బుద్ధుడు, బౌద్ధం, అశోకుడు కాదు మనదేశ హిందువులకు విదేశీ మతోన్మాదుల కుట్రలకు, కులోన్మాదుల కుట్రలకు బలి అయిపోని ఉనికి, జీవనం కావాలి.
బుద్ధుడి ప్రతిమలు, అశోకుడి చిహ్నాలు మనదేశానికి అక్కర్లేదు. ఇవాళ ఈ దేశంలో హిందువులకు కావాల్సింది అభయం, భద్రత, ప్రగతి, నెలవు. భారతదేశం ఎప్పటికీ హిందువులకు నెలవుగానే ఉండాలి.
– రోచిష్మాన్
9444012279