Suryaa.co.in

Telangana

ఇది అర్భక ప్రభుత్వం

చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్
రైతుబంధు, రైతు భరోసా’ల ప్రస్తావనే లేదు
మేం రెండు పంటలకు కూడా రైతు బంధు ఇచ్చాం
వ్యవసాయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉండె
ఇది పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం
భవిష్యత్తులో మేం చీల్చి చెండాడపోతం
– మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్

హైదరాబాద్: ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదు. డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఏ కొత్త సంక్షేమ పథకాలు కూడా లేవు. మహిళా సంక్షేమం పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉండె. కానీ వాళ్లు రుణాలే ఇస్తామన్నారు. అది అల్రెడీ ఉన్న స్కీమే.

కొత్త ప్రభుత్వం తర్వాత ఆరు మాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. ఈ‘అర్భక ప్రభుత్వం’ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేసినట్లుగా కనబడతలేదు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేం రెండు పంటలకు కూడా రైతు బంధు ఇచ్చాం. వ్యవసాయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉండె.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు’ను ఎగ్గొడదామని చూస్తున్నారు. రైతుబంధుపై దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం’ అని తెలుస్తావుంది.

ధాన్యం కొనుగోలు, విద్యుత్, నీరులు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతావున్నరు. రైతుబంధు, రైతు భరోసా’ల ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తరని మా ఎమ్మెల్యేలు అడిగితే దానికి సమాధానం చెబుతలేరు. రైతులనే కాదు, వృత్తి కార్మికులనూ వంచించిందీ ప్రభుత్వం.

ఇండస్ట్రియల్ పాలసీ వట్టిదే గ్యాసు.. ట్రాష్. ఈస్ట్ మన్ కలర్ లో స్టోరీ టెల్లింగ్ ల తప్ప బడ్జెట్ లో ఏం లేదు. రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ, పేద వర్గాలకు సంబంధించిన వాటిపై పాలసీలు ఏంటి? అనే ఏ ఒక్కదానిపైన ఏం లేదు.

చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్’ గా, రాజకీయ సభల్లో ప్రసంగంలా తప్ప బడ్జెట్ ప్రసంగంలా లేదు. బడ్జెట్ లో ఒక పాలసీ గానీ, ఏదైనా సాధిస్తామన్న పద్ధతి గానీ, పద్దు గానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు. దీనిపై భవిష్యత్తులో మేం చీల్చి చెండాడపోతం.

 

LEAVE A RESPONSE