Home » రేవంత్ గాలి మాటలు మాట్లాడటం సరికాదు

రేవంత్ గాలి మాటలు మాట్లాడటం సరికాదు

-మహబూబ్ నగర్ లో బిజెపి ఎలా గెలిచింది?
-రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో బీజేపీ కి మెజారిటీ వచ్చింది
-రేవంతే అక్కడ బీజేపీ కి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా?
– ఢిల్లీలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు.

మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బిఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో బీజేపీ కి మెజారిటీ వచ్చింది ..రేవంతే అక్కడ బిజెపి కి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా?

రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బిజెపి ఎలా గెలిచింది? మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. వారంతా కలిసి బిజెపిని గెలిపించారా?

కొడంగల్లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బిజెపికి వేయించారా? రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బిజెపి భారీ మెజారిటీతో ఎలా గెలిచింది? ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బిజెపిని గెలిపించిందా?

బిజెపి పంచన చేరింది, మోడీ శరణు చొచ్చింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి . నిండు సభలో మోడి ని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి . మోడీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారు.

విభజన హామీలపై రేవంత్ రెడ్డి, మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బిఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు.

Leave a Reply