Suryaa.co.in

Andhra Pradesh

హిందువుకు జగన్‌ అండ్‌ గ్యాంగ్‌ వెన్నుపోటు!

• సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు!
• మరోవైపు పార్టీకి కాలం చెల్లిందనే భయంలో నేతలు
• టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శ

మంగళగిరి: జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్తు హిందు సమాజానికి వెన్నుపోటు పొడిచిందని, సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తో కలిసి దీపక్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి ఏమన్నారంటే.. వైసీపీ నాయకులంతా కూడా ఆ పార్టీ మూతపడుతోందనే భయంతో బిగ్ బాస్ లోకి వెళ్లి కాంటెస్టెంట్స్ గా చేయాలనే ధ్యేయంతో రకరకాల వీధి నాటకాలు వీధికి ఒక్క నాయకుడు మీడియా ముందుకు వచ్చి ప్రదర్శిస్తున్నారు.

వైవీ సుబ్బారెడ్డి ఒక్క పక్కన, భూమన ఒక్క పక్కన, పొన్నవోలు మరోపక్క.. బులుగు బ్యాచ్ అంతా కలిసి రకరకాల దుష్ప్రచారం చేస్తూ వాళ్లు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారు చెప్పిన అబద్దాలు అని పట్టాభి రామ్ రుజువు చేశారు. తప్పు జరిగిందని తెలిసి కూడా ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా కనీసం ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రధాని మోడీకి ఓ లేఖ… సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగులు పెట్టిస్తు ఉన్నారు… తిరిగి తెలుగుదేశం పార్టీపైన, ప్రభుత్వంపైన ఎదురుదాడి చేసి వారు ఈ విధంగా నాటకాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే విధంగా ప్రయత్నించారని, ప్రజలందరూ కూడా గమనించాలి.

యూపీకి చెందిన అల్ఫా మిల్క్స్ ప్రాడక్ట్స్ అనే పేరుతో హలాల్ ప్రాడక్ట్స్ లను దుబాయ్‌కి సరఫరా చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్న వారికి పట్టుకున్న విషయం వాస్తవమా.. కాదా..? గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో చర్చలు రావడం వాస్తవం కాదా..? క్రైస్తవుడు అయిన జగన్ రెడ్డి టీటీడీ రిజిస్టర్ డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు అని ప్రశ్నించిన కూడా ఆ దేవాలయ సంప్రదాయాన్ని ఎందుకు గౌరవించలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు సంతకాలు చేశారు. మరి మీరెందుకు సంతకం చేయట్లేదు..? కరుణాకర్ రెడ్డి గురించి విచారిస్తే గతంలో ఎస్టీడీ బూత్, జిరాక్స్ మిషన్ నడుపుకొనే స్థాయి నుంచి ఈ రోజు వేల కొట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారు..?

నేను నాస్తికుడిని అని చెప్పుకుంటూ తిరుమల కొండ మీద రాయి ఉందంటూ చెప్పుకు తిరిగారనేది వాస్తవం కాదా..? ఆయన కూతురికి క్రైసవ సంప్రదాయంలో పెళ్లి చేసిన విషయం వాస్తవం కాదా..? 3,75,000 టికెట్లు బ్లక్ లో అమ్ముకున్నారు.. వాస్తవం కాదా..? నియోజకవర్గంలో ఉండే ఓటర్ లిస్టు కంటే ఎక్కువ టికెట్లు బ్లాక్ లో అమ్ముకుని వ్యాపారం చేశారు. సీఎం అదేశానుసారం విజిలెన్స్ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా రూ.550 కోట్లు దేవుడి సోమ్మును అనేక మార్గాల్లో దోచేశారని నివేదిక ఇచ్చారు. ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే. రానున్న రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక రాబోతుంది. అన్ని వాస్తవాలు బయటకు రాబోతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి భార్య గతంలో చేతులో బైబిల్ పట్టుకుని బహిరంగంగానే తిరిగారు.

క్రైస్తవ మతానికి చెందిన వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీ హయాంలో తప్పులు జరిగాయి కనుక విచారణకు రండి..’’ అని నాలుగు సార్లు నోటిసులు జారీ చేసిన కూడా ఇంతవరకు కనీస సమాధానం కూడా చెప్పకుండా ఎందుకు ఉన్నారు..? నిజంగా నీతివంతులు అయితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు..? నన్ను అడగొద్దు అని ఎందుకు కోర్టును అశ్రయించారో వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. వైఎస్ కుటుంబ చరిత్ర చూస్తే బ్రిటిష్ వారికి మాంసాహర సరఫరా చేసే కాంట్రాక్ట్ ఉండేదని, ఈ చరిత్ర వారి కుటుంబానికి ఎప్పటి నుంచో ఉంది.. ఇది వాస్తవం కాదా..? తప్పు జరిగిందని తెలిసి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తులకు క్షేమాపణలు చెప్పకుండా నిసిగ్గుగా రాజకీయం చేయడం బాధాకరం.. ఏ విధంగా టీటీడీని దోచుకుని అపచారం చేశారో.. బయట పడింది. చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి కాగానే కారకులందరూ జైలుకు పోవడం ఖాయం.

LEAVE A RESPONSE