Suryaa.co.in

Andhra Pradesh

జగన్ సర్కారు చంద్రబాబు నాయుడుని టెర్రరిస్ట్ లా ట్రీట్ చేస్తోంది

వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో విఫలం
చంద్రబాబు నాయుడు విషయం లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజు రోజుకి ఇబ్బంది గా ఉంది..చంద్రబాబు నాయుడుకు ప్రాణహానికి ఉంది. నిన్న భువనేశ్వరినీ కలిసి సంఘీభావం తెలిపాము. చంద్రబాబు నాయుడు కు సరైన వైద్య సదుపాయాలు లేవు.. చంద్రబాబు నాయుడు కు ప్రాణ హాని జరిగితే ముఖ్యమంత్రి జగన్ ది బాధ్యత. చంద్రబాబు నాయుడు కు కావాల్సిన వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో విఫలం అయింది.

చంద్రబాబు కు స్పెషల్ గా మెడికల్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు విషయం లో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. చంద్రబాబు నాయుడు ని టెర్రరిస్ట్ లాగా ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది. అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు కు మద్దత్తు గా నిలిచాయి. జగన్ సర్కార్ ప్రతి విషయం లో విఫలం అయింది. కేవలం అరెస్ట్ లు, భయబ్రాంతులకు గురి చేసి పాలన చేస్తున్నారు. తొందరగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పరిస్థితి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ని జగన్ అన్యాయం గా అరెస్ట్ చేశారు అని గగ్గోలు పెడుతున్నారు…సామాన్య ప్రజలు ఆవేదన పడుతున్నారు.

సుప్రీం కోర్టు లో వాయిదా లు వాయిదా లు వేస్తూ పబ్బం గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు విషయం లో చొరవ తీసుకోవాలి అని తెలంగాణ తెలుగుదేశం తరపున డిమాండ్ చేస్తున్నాము.. జగన్ కేవలం కక్ష సాధింపు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు విషయం లో ప్రభుత్వం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే ,పరిస్థితి దారుణం గా తయారు అవుతుంది. ఊహకు అందని తీరు లో చంద్రబాబు నాయుడు నీ ట్రీట్ చేస్తున్నారు.జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉంది.

LEAVE A RESPONSE