Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి

-ముస్లింలపై జాతి అహంకారంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డి అండ్ కో
-రంజాన్ మాసంలో ముస్లింలపై వైసీపీ దాడులు చేస్తుంటే డీజీపీ ఏం చేస్తున్నారు?
-‘ముస్లింలను నమ్మకూడదు’ అని అవమానించిన వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి
– రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుంది. నంద్యాలలో ముస్లిం యువతికి జరిగిన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జగన్ రెడ్డి పాలనలో ముస్లింలకు రక్షణ లేదు. ముస్లింలంటే తమ కాళ్ల దగ్గర పడి ఉండే వాళ్లలా భావిస్తూ జాతి అహంకారంతో జగన్ రెడ్డి వర్గం విర్రవీగుతుంది.

నిన్న నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న మహిళపై వైసీపీ నాయకుడు, నందికొట్కూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పరాభవానికి గురి చేశారు. ముస్లింలను నమ్మకూడదంటూ ముస్లిం జాతినే అవమానించారు. ఆమె కుమారుడిపై దాడి చేయించారు. మొన్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైసీపీ అభ్యర్ధి మగ్బూల్ బంధువు, మాజీ కౌన్సిలర్ వహీద అనే ముస్లిం మహిళపై చెప్పుతో దాడి చేసి అవమానించారు. ఇలా రోజుకో చోట అవమానిస్తున్నారు.

గతంలోను వైసీపీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు, పలమనేరులో మిస్బా ఆత్మహత్య చేసుకుంది. అందుకే 5ఏళ్లల్లో ముస్లింలపై 60కి పైగా దాడులు, 15 మందికి పైగా అత్యాచారాలు, 9 మందిపై హత్యలు, వేలాది మందికి అవమానాలు జరిగాయి. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలుండే ముస్లింలపై ఏటికేడు వైసీపీ దాష్టికాలు పెరిగిపోతూ ఉన్నాయి. గత ఏడాది పెదకూరపాడులో ముస్లిం యువకుడిపై పోలీసులతో దాడిచేయించారు. వైసీపీ నాయకుల వేధింపులతో ఇంకెంత మందిని బలితీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముస్లింల పక్షాన నిలిచింది. ముస్లింలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంది. శాంతిభద్రతలను కాపాడింది.

LEAVE A RESPONSE