Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి విద్యార్థులకు మేనమామ కాదు..నరహంతక రాక్షస మామ

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

కోట్లు కొట్టేసేందుకు పసిపిల్లల ప్రాణాలూ పణంగా పెట్టేస్తున్న జగన్ రెడ్డి విద్యార్థులకు మేనమామ కాదు..నరహంతక రాక్షస మామ. వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వల్లే కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి స్కూల్ నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యంతో గోడకూలి ఎనిమిది మంది పిల్లలు, టీచర్ సుజాతకి తీవ్రగాయాలయ్యాయి. పాత స్కూల్ భవనం కూల్చుతున్నప్పుడు ఆనుకుని ఉన్న కొత్త భవనంలో పిల్లలని ఖాళీ చేయించాలని కనీస బాధ్యతలేని వైసీపీ కాంట్రాక్టర్, అధికారులే ఈ ప్రమాదానికి బాధ్యులు. వైసీపీ సర్కారు నాడు నేడు పనుల్లో దోపిడీపై పెట్టిన శ్రద్ధ పిల్లల ప్రాణాలపై లేకపోవడం విచారకరం.

LEAVE A RESPONSE