Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలకు మంచి చేయడానికి మళ్లీ జగన్ నే సీఎం చెయాలి

ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్‌ రావాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు..ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే(వై ఏపీ నీడ్స్‌ జగన్‌)కార్యక్రమంపై అధివారం సోషల్ మీడియాలో స్పందించారు..ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక పార్టీ దేశంలో వైఎస్సార్ సీపీ మాత్రమేనని అన్నారు. పేదవాడికి సంక్షేమ పధకాలు మరింతలా అందాలంటే మళ్లీ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావాలన్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, కార్యక్రామాల అమలులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధమ స్థానంలో ఉందన్నారు…

అభివృద్ధికి రోడ్ మ్యాప్
రాష్ట్రంలో నగరాలు,పట్టణాల్లోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం జగన్ అధికారులను అదేశించారని విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం ముగియడంతో పనుల సీజన్ మొదలైందని,వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చెయ్యడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించినట్లు ఆయన చెప్పారు..

LEAVE A RESPONSE