– కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న
– మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం : చీపురుపల్లి మండలం చీపురుపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆణిముత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆ సభను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తల్లి తండ్రులు వారి పిల్లలు విషయం వారు కోరుకునేది ఏదైనా వుంది అంటేమా పిల్లలు రాబోయే కాలంలో మా పిల్లలు వున్నత స్థాయికి వెళ్ళాలి మంచి పేరు పొందాలనే ఒక ఆశ ఉంటుందని, అది నేరవేరాలంటే వారు చదువుతున్న పాఠశాలలో అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలన్నారు.
అప్పుడే మీ పిల్లలు చదవటానికి ఎక్కువ అవకాశం ఇస్తారని అయన అన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉండేవి కాదని, ఎన్నో అవస్థలు పడేవారని, అలాంటి మన ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేక రాష్ట్రంలో వున్న అన్ని పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో విద్యార్థికి రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థి వేసుకునే బూట్ల నుంచి వారికి అవసరైన అన్ని బాధ్యతలు మన ముఖ్యమంత్రి జగనన్న తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
అనంతరం అక్కడ ఉన్న విద్యార్థులను జగనన్న ప్రవేశపెట్టిన అన్ని పథకాల మీకు అందుతున్నాయా లేవా పాఠశాలలో సౌకర్యాలు కలిగిస్తున్నారా లేదా ఉపాధ్యాయులు మంచి విద్య నేర్పిస్తున్నారా లేదా అనేది అయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ టివిలు ఏర్పాటు చేసిన పాటలు చెప్పాలని మన జగనన్న తెలియచేసారని అయిన అన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాల్లో ఏర్పాటు చెయ్యడం జరిగిందని అయన అన్నారు. రాష్ట్రంలో వున్నా ప్రేతి విద్యార్థి ఉన్నత స్థాయికి వేళ్ళని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.
మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో మరింత విద్యలో ఉత్సహంగా చదవాలని ఉద్దేశ్యంతో ఈ జగనన్న అమ్మ వొడి జగనన్న వసతి దీవెన.జగనన్న గోరు ముద్ద అనే కార్యక్రమాలు మీ ముందికి తీసుకురావడం జరిగింది.ఆనాడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లు అయితే పల్లె గ్రామాలు నుంచి వారి పిల్లలను చదివించడానికి బడికి పంపించే పరిస్థితిలు వుండేవి కాదు అలాంటిది మన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చాక చదువుకున్న ప్రేతి విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా మీ పిల్లలను చదివించే బాధ్యతలు మన జగనన్న తీసుకున్నారు అని చెప్పుకోవచ్చని అయన అన్నారు.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో మంచి కార్యక్రమం మీముందికి తీసుకురావడం జరుగుతుంది.అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం విషయంలో కానివ్వండి అలాగే పాఠశాలలో వున్నా టోలెట్స్ రూమ్స్.వాటర్ సౌకర్యాలు కలిపించే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆమె అన్నారు.
జిల్లాలో ప్రేతి విద్యార్థి విద్యార్థులు కూడా మంచి చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లి మన విజయనగరం జిల్లాకు మంచి పేరు తెచ్చే విద్యార్థుల ఉండాలని ఆమె విద్యార్థులను కోరారు..మరియు దేశ చరిత్రలలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువును అభ్యసించిన విద్యార్థి విద్యార్థులకు పదో తరగతి ఇంటర్ మీడియట్ పరీక్షలో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థులకు ఆణిముత్యాయన పథకం ద్వారా సన్మానించి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది.
అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నైట్ వాచ్మెన్ లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో విద్యాశాఖ అధికారులను రెండు పోస్టులను నియమిస్తున్న దానికి సంబందించిన జి ఓ ను విడుదల చేసాంమన్న మంత్రి.అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ చేతులు మీదిగా ఈ సంవత్సరం పది తరగతి మరియు ఇంటర్ ఫలితల్లో మొదటి రెంక్ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందించడం జరిగింది. అలాగే ఆ పాఠశాలలో ప్రతి తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన డిజిటల్ టీవీలను ప్రారంభించరు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు నాయకులు నియోజవర్గం అధికారులు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.