– మాజీ మంత్రి, టీడీపీ పొమిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు
-రాజ్యాంగాన్ని, ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలను సైతం లెక్కచేయడం లేదు
-రాష్ట్రాన్ని ఆర్ధిక అధోగతి పాలు చేసేవరకు జగన్ నిద్రపోయేట్టు లేడు
జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా ఆర్ధిక ఉల్లంఘనలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తోంది. ఓ వైపు బడ్జట్ ప్రతిపాదనలు ప్రక్కనపెడుతూ మరోవైపు ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీని ఆర్ధిక ఊబిలోకి నెడుతోంది. ఇటీవల కేంద్ర ఆర్దికశాఖ కార్యదర్శి సోమనాధన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖే ఇందుకు నిదర్శనం.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వ సీ.ఎఫ్.యం.యస్ను బైపాస్ చేస్తూ దొడ్డిదారిలో బిల్లులు చెల్లించారు. ట్రెజరీ కోడ్ ను ఉల్లంఘించి ప్రత్యేక బిల్లుల కింద రూ.48,284.32 కోట్లు తన అనుయాయులకు దోచిపెట్టారు. ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించి తెరవెనుక నడిపిన వ్యవహారాలను సమర్ధించుకోవడానికి జీవో నెం.80 విడుదల చేశారు. వేస్ అండ్ మీన్స్ ద్వారా రూ.1.04 లక్షల కోట్ల ప్రత్యేక నిధులు, ఓడీ కింద రూ.31 వేల కోట్లు తీసుకొచ్చి దేనికి ఖర్చుపెట్టారో కూడా లెక్కలు చెప్పలేదు. మద్యంపై బాండ్లు విడుదల చేసి తెచ్చిన రూ.8,305 కోట్లు, ఏపీఎస్.డి.సి ద్వారా తెచ్చిన రూ.25 వేల కోట్ల అప్పులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) కి పూర్తి విరుద్ధం.
దేశంలోనే అత్యదికంగా చేబదుళ్లు తీసుకున్న ప్రభుత్వం కూడా వైసీపీనే. 2019-20 లో 57 రోజులు, 2020-21 లో 103 రోజులు, 2021-22 లో 146 రోజులు ఓడికి వెళ్లి మొత్తంగా మూడేళ్లలో 306 రోజులు ఓడికి వెళ్లారు. ఇది ఏడాదికి సరాసరి 102 రోజులు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఏడాదికి సరాసరి కేవలం 35 రోజులు మాత్రమే వెళ్లడం జరిగింది.
తెదేపా ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో రూ.1,63,981 కోట్లు అప్పు చేసింది. అంటే ఏడాదికి రూ.32,800 కోట్లు మాత్రమే. కానీ, వైకాపా ప్రభుత్వం మూడేళ్ల రూ. 3,67,859 కోట్లు అప్పు చేసి ఏడాదికి సరాసరి రూ.1,11,472 కోట్లు చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఐదు నెలల కాలంలోనే రూ.46,803 కోట్లు అప్పు చేశారు. మద్యం బాండ్లు పెట్టి మరో రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పులు చేయడంలో వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే జగన్ రెడ్డి దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పులను రూ.10 వేల కోట్లు చేసేట్టు ఉన్నారు.
రెవెన్యూ లోటు
సంవత్సరం రెనెన్యూ లోటు స్టూల ఆదాయంలో శాతం
1 2014-15 13,376 2.62
2 2015-16 7032 1.21
3 2016-17 17231 2.52
4 2017-18 16152 2.04
5 2018-19 13899 1.61
6 2019-20 30280 2.72
7 2020-21 35441 3.60
2018-19 లో రూ.13,899 కోట్లు ఉన్న రెవెన్యూ లోటు రెండేళ్లలో రూ.35441 కోట్లకు చేరింది. వైసీపీ ప్రభుత్వ మొదటి రెండేళ్లు కలిపి రూ.65 వేల కోట్లు. తెదేపా ఐదేళ్ల లోటుకు ఇది సమానం. ఇంతటి రెనెన్యూ లోటు దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో లేదు.
ద్రవ్య లోటు
సంవత్సరం రెనెన్యూ లోటు స్టూల ఆదాయంలో శాతం
1 2014-15 20,230 3.87
2 2015-16 22,507 3.65
3 2016-17 30,908 4.52
4 2017-18 32,281 4.08
5 2018-19 35467 4.11
6 2019-20 65784 6.76
7 2020-21 93931 9.60
2018-19 లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి ద్రవ్యలోటు స్థూల ఆదాయంలో 4.11 శాతం వైసీపీ ప్రభుత్వం దాన్ని 9.60 శాతానికి పెంచేసింది.
జగన్ రెడ్డి సృష్టించిన ఆర్ధిక సంక్షోభం, వ్యవస్థల విధ్వంసం కారణంగా రాష్ట్రం సరిదిద్దలేని అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఉపాధి కల్పన గుండు సున్నా. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. యువత ఉపాధి కోల్పోయింది. రాష్ట్రంలో యువకులు తీవ్ర నిరాశనిస్పృహల్లో ఉన్నారు. తెదేపా హయాంలో 4 శాతం ఉన్న నిరుద్యోగం నేడు 12 శాతంకు పెరిగిపోయింది.