Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఆదాయం పెరిగింది… రైతుల ఆదాయం తగ్గింది

– రైతుల కోసం నా జీవితంలో అసెంబ్లీలోని పోడియం వద్ద నేలపై కూర్చున్నా
– గడపదాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం
– ఒక పని అనుకుంటే దాన్ని సాకారంచేసేవరకు నేను నిద్రపోను
– మీరు ఒక్కఛాన్స్ అన్న వాడిని నమ్మి మోసపోయారు
– వెలిగొండ ప్రాజెక్ట్ ను 95 శాతంపూర్తి చేయించా
– అంత పనిచేసిన పార్టీకి మీరు ఓటేయలేదు
– 5 ఏళ్లలో 5 శాతం పనులు చేయలేని దద్దమ్మను చూసి బాధపడుతున్నారు
– రైతులు ఎవరైనా జగన్ ను ప్రశ్నించేస్థితిలో ఉన్నారా?
– మార్కాపురంలో అన్నదాతల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో జగన్ ఆదాయం పెరిగింది. రైతుల ఆదాయం తగ్గింది. ప్రతిరైతుపై రూ.2.45లక్షల అప్పుభారం పడింది. రైతుని రాజుని చేయడమే నాలక్ష్యం. రైతులకు భూసార పరీక్షలు, ఉచితంగా సూక్ష్మపోషకాలు, సబ్సిడీపై ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రపరికరాలు, ట్రాక్టర్లు అందించాము. పంట ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటుచేశాము. ప్రతి పంటకు గిట్టుబాటుధర కల్పించాము. నేను రైతుబిడ్డను, వ్యవసాయం తెలిసినవాడిని, రైతులకష్టాలు చూసినవాడిని. మీరు చెప్పే సలహాలు, సూచనలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఉంటుంది. పొలంబాట కార్యక్రమంతో అధికారుల్ని, ఎమ్మెల్యేలను రైతులవద్దకు పంపాను. ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక్క రైతు ముఖమైనా చూశాడా? గడపదాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం.

గ్రామాల్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం ద్వారా, రైతులు పండించే ఉత్పత్తుల్ని ఈ ట్రేడింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవచ్చు. వ్యవసాయంలో సాంకేతికత ఉపయోగించాలి. భూమి ఎలాంటిది.. ఎలాంటి పంటవేయాలి..ఎలాంటి ఎరువులు వేయాలో ఆలోచిస్తే, అలాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రకృతివ్యవసాయాన్ని రాష్ట్రంలో అమలుచేయడానికి రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాము. మహారాష్ట్ర నుంచి సుభాష్ పాలేకర్ ను పిలిపించి, రైతులకు ఉపయోగపడే సూచనలు, సలహాలు ఇప్పించాము. రైతుల సమస్యలపై శ్రద్ధపెట్టాను కాబట్టే, వారికి నీటివసతి కల్పించడమే ప్రధాన ఉద్దేశ మని భావించి, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. వ్యవసాయరంగంలో ఆధునికీకరణ కోసం హార్వెస్టర్లు, స్ప్రింక్లర్లు, ట్రాక్టర్లు, ఇతరత్రా యంత్రపరికరాలు సబ్సి డీపై అందించాము. రైతులువారిఉత్పత్తుల్ని నిల్వచేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయించాము.

యాప్ లసాయంతో ట్యాక్సీలు, బైక్ లను బుక్ చేసుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరినట్టే, రైతులుకూడా వారు పండించే ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడానికి, మంచి ధరకు అమ్ముకోవడానికి కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ కావొచ్చు. ఫోన్ లోని యాప్ తో మీవద్దఉంటే యంత్రాలు, ట్రాక్టర్లను కూడా ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు. తగినరుసుం వసూలుచేయవచ్చు. అలానే విపరీతమైన పురుగుమందుల వాడకంతో రైతులు నష్టపోతున్నారు. ఎలాప డతే అలా పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల పంటలకు నష్టం కలుగుతోంది. డ్రోన్లతో పంటలకు వచ్చిన తెగుళ్లు, పురుగుల్నికనిపెట్టి, వాటిసాయంతోనే పురుగు మందుల్ని చల్లితే చాలావరకు రైతులకు మేలుకలుగుతుంది. ఏ పంట పండించాలి? ఏ నేలలో ఏపంట అయితే బాగా పెరుగుతుంది? కాలానుగుణం గా ప్రజల అవసరాలకు తగినట్టు ఏపంటలు పండించాలనే ఆలోచన రైతులు చేయాలి . దానికి తగిన అధ్యయనంచేసి, మీకున్నభూముల్లో ఏపంటలు వేస్తే, మీకు ఆదా యం పెరిగి మీరు సంతోషంగా ఉంటారో ఆలోచిస్తున్నాను. ఏ రైతు ఇబ్బందిపడకూడ దు అన్నదే నాఆలోచన. దానికి అనుగుణంగా మీఆలోచనల్లో మార్పురావాలి.

ఒక పని అనుకుంటే దాన్ని సాకారంచేసేవరకు నేను నిద్రపోను. ఆ విషయం మీకు కూడా తెలుసు. హైదరాబాద్ నగరాన్ని ఎలామార్చానో మీరుచూశారు. 25ఏళ్లలోనే ప్రపంచంలోనే ఎక్కువమంది కోటీశ్వరులు ఉండే నగరంగా హైదరాబాద్ మారిందంటే తెలుగుదేశం ముందుచూపే కారణం.
మీ చుట్టూ ఉండే వారిపిల్లలే ప్రపంచంలో వివిధరంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు సరిగా లేనిప్రాంతాలు నేడు అభివృద్ధిచెందాయి. కరెంట్ ఉత్పత్తికి బొగ్గు, నీరే కాకుండా ఎండను వినియోగిస్తున్నాం. అదే ఆలోచనతో మీ పొలాల్లో మీరు ఎండద్వా రా కరెంట్ ఉత్పత్తిచేసుకునేలా ఫ్రీగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటుచేయించాను. కానీ మీరు ఒక్కఛాన్స్ అన్న వాడిని నమ్మి మోసపోయారు. ఇప్పుడు మీ పొలాల్లోని నీటిమోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. మీ మెడలకు ఉచ్చు బిగిస్తున్నాడు.
రైతులకు పంటలబీమా ఉండేది. దానికి సంబంధించిన సొమ్ములో కొంత కేంద్రం కడితే మిగిలింది రాష్ట్రప్రభుత్వం, రైతులు కట్టేవారు. పంటలు నష్టపోతే, ఆ సొమ్ము మీకు వస్తుందనే నమ్మకం ఉండేది. కానీ ఈముఖ్యమంత్రి పంటలబీమా సొమ్ముకట్టకుండా కట్టానని అసెంబ్లీలోనే అబద్దాలు చెప్పాడు. మొట్టమొదటిసారి రైతులకోసం నాజీవి తంలో అసెంబ్లీలోని పోడియంవద్ద నేలపై కూర్చున్నాను. పంటలబీమా సొమ్ము కట్ట నిప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టాను. జగన్ నోరువిప్పితే అబద్ధమే. ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యమే.

1995లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆదాయం లేదు. జీతాలు ఇవ్వ లేని పరిస్థితి. అలాంటిరాష్ట్రాన్ని బాగుచేయడంకోసం 9ఏళ్లుకష్టపడ్డాను. దానిఫలితమే రాష్ట్రం విడిపోయినా, హైదరాబాద్ లాంటి నగరం మనముందు ఉంది. అమరావతి నిర్మాణంకోసం రైతులు స్వచ్ఛందంగా 34వేలఎరాలు ఇచ్చారు. దాన్ని నిర్మించడం చేతగాని ముఖ్యమంత్రి కులం, ప్రాంతం అని విద్వేషాలు రాజేశాడు. శ్మశానమని, ఎడారని, నిర్మాణాలకు పనికిరాదని విషప్రచారంచేసి, బంగారం లాంటి నగరాన్ని నాశ నం చేశాడు. ప్రజలకోసం నిర్మించాలనుకున్న ప్రజారాజధాని అమరావతిని పాడుచేశాడు. ప్రజలకోసం, రాష్ట్రంకోసం భూములిచ్చిన రైతులపై తప్పుడుకేసులు పెట్టి, వారిని వేధిస్తున్నాడు. ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపుతున్నాడు. ఆఖరికి బాబాయ్ ని చంపి, ఎన్నివిన్యాసాలు చేస్తున్నాడో చూస్తున్నారు కదా! ఏంటీ అరాచకం…ఎన్నాళ్లు ఇలా? గొర్రె కసాయిని నమ్మినట్టు నరహంతకుడిని నమ్మితే ఏమవుతారు?

రాష్ట్రంపై రూ.10లక్షలకోట్ల అప్పుఉంది. అదంతా జగన్మోహన్ రెడ్డో, నేనో తీర్చము. మీరే తీర్చాలి. ఆ భారం మీపైనే పడుతుంది. పరిపాలించేవాళ్లు శాశ్వతం కాదు.. సమాజం..రాష్ట్రం శాశ్వతమనే ఆలోచన లేని వ్యక్తి జగన్. అందుకే అన్నివర్గాల ప్రజ లు బాధపడుతున్నారు. మీరు చెప్పిన ప్రతిఅంశాన్ని గుర్తుపెట్టుకుంటాను. వచ్చే టీడీపీప్రభుత్వం రైతుకు అండగా ఉండటానికి ఏంచేయాలో అవన్నీచేస్తుందని హామీ ఇస్తున్నాను. రైతుల జీవి తాలు ఆనందంగా ఉండేలా, రైతుల రాజుల్లా బతికేలా ఏంచేయాలో చేస్తాను. మీరు కూడా చర్చించండి. నరేగాపనుల్ని వ్యవసాయానికి అనుసంధానంచేస్తే, కూలీల బాధ రైతులకు ఉండదని, కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుందని ఆలోచించాను. నరేగా పనుల్ని వ్యవసాయానికి కచ్చితంగా అనుసంధానించాలి.

మీరు ఇచ్చిన సలహాలు, సూచనల్ని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. మెరుగైన వ్యవసాయవిధానాలతో మీజీవితాల్ని మార్చే బాధ్యత నాదే.రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయాక, రాష్ట్రం ఆర్థికలోటులోఉంది. అయినా కూడా రైతులకు ఒక్కొక్కకరికి రూ.లక్షా50వేల రుణమాఫీ చేసింది. ఏపీలోని రైతులకు ఒకేసారి రూ.50వేలరుణాన్ని మాఫీచేసింది తెలుగుదేశంప్రభుత్వం. జగన్ ఈ ఐదేళ్ల లో రూ.7వేలచొప్పున మీకు ఇచ్చేది కేవలం రూ.35వేలు మాత్రమే. తొలిసారి మొత్తం రూ.50వేల రుణమాఫీచేసి, తరువాత మరలా ‘అన్నదాతాసుఖీభవ’ కింద 4, 5వ విడతల కింద ఒక్కోరైతుకి రూ.లక్షా50వేలు ఇస్తే, ఈదుర్మార్గుడు వచ్చి మీకు అంద కుండా అడ్డుకున్నాడు. రైతులకు భూసారపరీక్షలు అందుబాటులోకి తెచ్చాము. సబ్సిడీపై ఎరువులు, పురుగమందులు, యంత్రపరికరాలు, డ్రిప్ పరికరాలు, ట్రాక్టర్లు ఇచ్చాము. గిట్టుబాటు ధర అమలుచేశాం. ప్రతిమంగళవారం ‘పొలంబాట’ కార్యక్రమంతో రైతుల వద్దకు అధికారుల్ని, ఎమ్మెల్యేలనుపంపించాను. ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక్క రైతు ముఖమైనా చూశాడా? గడపదాటి బయటకురాని ముఖ్యమంత్రి ఉండటమే మన దౌర్భాగ్యం. నేను రైతుబిడ్డను, వ్యవసాయం తెలిసిన మనిషిని. రైతుల కష్టాలు నేరుగా చూసినవాడిని. మీకేంచేయాలో తెలిసినవాడిని.”

రైతులు చంద్రబాబుగారిని అడిగిన ప్రశ్నలు…. ఆయన వారికి చెప్పిన సమాధానాలు.

ప్రశ్న-1 : మీనాన్నగారు రైతు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎన్నుకోవాలని మీకుఎప్పుడైనా అనిపించిందా? (సత్యం- కనిగిరి)
జవాబు : ఒకప్పుడు రైతుకి గౌరవం మర్యాద ఉండేవి. రైతులు కష్టపడితేనే ప్రజల కడుపు నిండుతుంది. అప్పట్లో మెజారిటీశాతం ప్రజలు వ్యవసాయంపైనేఆధారపడేవారు. మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు కరెంట్ కూడాలేదు. ఊటకాల్వల నుంచి వచ్చేనీటితో పంటలు పండించేవారు. అప్పట్లో రైతాంగం చాలాకష్టపడేది. మా తండ్రిగారు చెరకు పండించేవారు. ఒక్కోసారి బాగాలాభాలువచ్చేవి, ఒక్కోసారి అసలు కొనేవారు ఉండేవారుకాదు. మాతండ్రి రైతు అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఆయన బాగాచదివించాడు కాబట్టే, ఉన్నతస్థానానికి రాగలిగాను. రైతులు, రైతుకూలీలు వారిపిల్లల్ని బాగా చదివించాలి. రైతు కుటుంబంలోని వారికుండే తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు, వినియోగిస్తే మనదేశం ప్రపంచం లోనే నెంబర్ 1 గా నిలుస్తుంది.

ప్రశ్న-2 : మెట్టభూములకోసం నీటిని సద్వినియోగంచేసుకునేలా డ్రిప్ విధానాన్ని తీసుకొ చ్చారు. జగన్ వచ్చాక అదిలేకుండా పోయింది. వ్యవసాయాన్ని నాశనంచేసిన దుర్మార్గుడు జగన్. వెలిగొండప్రాజెక్ట్ పూర్తిచేస్తేనే మా ప్రాంతం బాగుపడుతుంది. అపరాలు కొనేవారు లేరు సార్.. ఎరువలధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి సార్. (కీలం ఇంద్రభూపాల్ రెడ్డి, కనిగిరినియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షులు)
ప్రశ్న-3 : మీరు అధికారంలోకి రాగానే వీఆర్వోవ్యవస్థను రద్దుచేయాలి సార్. ఎమ్మార్వోలు, కలెక్టర్లు నేరుగా రైతులవద్దకు వచ్చి వారిసమస్యలు పరిష్కరించేలా చేయాలి సార్? సమస్య లపై స్పందించేవారు లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకుసార్? 50 ఏళ్లుదాటిన రైతుల కు రైతుపింఛన్ ఇప్పించండి సార్. జీతాలులేకుండా కష్టపడుతున్నది రైతులు మాత్రమేసార్. మీరుఅధికారంలోకి వచ్చాక ఈ ముఖ్యమంత్రిలాగా ప్రధానిఇచ్చేసొమ్ముతో కలిపి రైతుభరోసా ఇవ్వకుండా, పెట్టుబడిరాయితీ కింద ప్రతి రైతుకి రూ.25వేలు ఇవ్వండి సార్. (బొగ్గు రామిరెడ్డి-మార్కాపురం)
జవాబు (రెండు ప్రశ్నలకు కలిపి) : మార్కాపురం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలోనే పాలి చ్చే గేదెను కాదనుకొని, తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. రైతుకి 5ఏళ్లపాటు ప్రతిఏటా వారిఆదాయం పెంచాను. సాగునీటిరంగానికి రూ.65వేలకోట్లు ఖర్చుపెట్టాం. రూ.1500 కోట్లతో వెలిగొండను 95శాతం పూర్తిచేశాను. తెలుగుదేశం ప్రభుత్వం మరలా వచ్చిఉంటే 2020నాటికి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయ్యేది. ఈ ప్రాంతానికి నేను 1995లో వచ్చినప్పుడు నీళ్లు కావాలని అడి గారు. మీకు ఇవ్వడానికి నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అప్పుడు రైతులు వరదలు వచ్చినప్పుడు మీరునీళ్లిస్తే, చెరువుల్లో నింపుకుం టామన్నారు. అందుకే వెలిగొండనిర్మాణం ప్రారంభించాము.

నేను ప్రారంభించిన వెలిగొండను ఏ ప్రభుత్వాలు పూర్తి చేయలేదు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాకే, పనులు వేగంగాపూర్తిచేసి, ప్రాజెక్ట్ ను 95 శాతంపూర్తి చేయించాను. అంత పనిచేసిన పార్టీకి మీరు ఓటేయలేదు. 5 ఏళ్లలో 5 శాతం పనులు చేయలేని దద్దమ్మను చూసి భాదపడుతున్నారు. రైతులఖర్చులు తగ్గి, ఆధునికవ్యవసాయపద్ధతులతో వారి ఆదాయం పెరగాలనే, ఇజ్రాయెల్ సాంకేతికతతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాము. 90శాతం సబ్సిడీపై మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చాము. భూసార పరీక్షలు చేయించాము. జీరో బడ్జెట్ తో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాము. గోదావరి డెల్టాలో ఆక్వాసాగుని ప్రోత్సహించాము.

ఇప్పుడు ధాన్యం కొని రైతులకు డబ్బులు ఇవ్వడంలేదు. పంటలు నష్టపోయిన వారికి ఆర్థిక సాయంచేయడంలేదు. తాము గర్వంగా, గొప్పగా వ్యవసాయ చేయగలమని రైతులు అనుకు నేలా చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అనేసైకో వచ్చాక ఏంజరుగుతుందో మీరే ఆలోచించాలి. అతని ఆదాయం పెరిగింది, రైతుల అప్పులుపెరిగాయి. రాష్ట్రంలోని ప్రతిరైతుపై రూ.2.45 లక్షల అప్పుఉంది. జగన్మోహన్ రెడ్డి తనపక్కునున్నవారిని ధనవంతుల్నిచేస్తున్నాడు. కానీ నేను పేదల్ని కోటీశ్వరుల్నిచేయాలి, రైతు రాజుగా బతకాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ చుట్టుపక్కల ఒకప్పుడు ఎకరం రూ.లక్షలోపు మాత్రమే ఉండేది. ఈరోజు ఎకరం రూ.100కో ట్లు అమ్ముతోంది. హైదరాబాద్ వల్లే తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని భూములధరలు పెరిగాయి. పరిశ్రమలు, రోడ్లు, మౌలికవసతులు కల్పిస్తేనే భూములధరలు పెరుగుతాయి. అనంతపురం జిల్లాలో కియాపరిశ్రమ రాకముందు అక్కడ ఎకరం భూమిధర రూ.20వేలు, రూ.30వేలు ఉండేది. నీళ్లుతీసుకెళ్లి కియాపరిశ్రమను ఏర్పాటుచేశాక ఎకరం ధర రూ.కోటి, రూ.2కోట్లు అమ్ముతోంది. వ్యవసాయం చేయడం కాదు.. దానికోసం రైతులకుతగిన భరోసా ఉండాలి. పిల్లలచదువులు, వ్యవసాయంలోని కూలీలకుఎక్కువ ఖర్చు అవుతోంది. పిల్లల్ని చదివించే పరిస్థితికూడా రైతులకు లేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తై, నదుల అనుసంధానం జరి గి వెలిగొండ పూర్తై ఉంటే మీ జీవితాలే మారిపోయేవి. అదే అభివృద్ధి. కానీ ఈసైకో ఏంచేశాడు ? రైతులు ఎవరైనా జగన్ ను ప్రశ్నించేస్థితిలో ఉన్నారా? రూ.12,500లు ఇస్తానన్న పెద్దమ నిషి రూ.7వేలు ఇస్తుంటే ప్రశ్నించరు. మీసమస్యలపై నాకు అవగాహన ఉంది. మీ జీవితా ల్ని బాగుచేసేవరకు ప్రతిరైతుకి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.

LEAVE A RESPONSE