Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి సమక్షంలో బిజెపిలో చేరికలు

ఫోర్బ్స్ ఫౌండేషన్ అధినేత శివ కృష్ణ గౌడ్ బిజెపి తీర్థం తీసుకున్నారు.
గత దశాబ్ద కాలంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శివ కృష్ణ గౌడ్ రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు.

దేశభక్తి ఉన్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మాత్రమే బిసీలకు న్యాయం జరిగిందని శివ కృష్ణ గౌడ్ ఈ సందర్భంగా అన్నారు. బిజెపి బలోపేతానికి కృషి చేయాలని మంత్రి వై సత్య కుమార్ యాదవ్ బిజెపి లో చేరిన ప్రముఖులుకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE