Suryaa.co.in

Telangana

మీ చెత్తబుద్ది తెలుసు కాబట్టే చెప్పుతో కొట్టారు

  • కేసీఆర్ చెల్లని రూపాయి
  • గోదావరి తల్లే మిమ్మల్ని తడిపి ఆశ్వీరదిందించింది
  • కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా 6500 కోట్లు వడ్డీ కడుతున్నం
  • పంపులు, మోటార్లు తయారు చేయించి కమిషన్లు మెక్కారు
  • సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధాని మోదీ కి వివరించాం
  • రెండు సీసాల్లో గోదావరి నీళ్లు కేసీఆర్ కు పంపించండి
  • సీతారామ ఎత్తిపోతల పథకం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం: జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సీతారామ లిఫ్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు అభినందలు. రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ఎలా మారింది. సీతారామ సాగర్ గా ఎలా మారి అంచనాలు పెరిగాయో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం ఒక రకంగా సంతోషం.. ఇంకో రకంగా ఒత్తిడి.

ఖమ్మం ఉమ్మడి జిల్లాకే అన్ని నిధులు కేటాయిస్తున్నారంటు మిగిలిన జిల్లాల నుంచి ఒత్తిడి ఉంది. ఫ్లోరైడు ప్రభావిత నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లు లో ఉన్న నల్గొండ .ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముందుకు వచ్చాం…

10 యేళ్లు అధికారంలో ఉండి సాగునీటి ప్రాజెక్టులపైన లక్షా ఎనభై వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నారు. సీఎం గా కేసీఆర్ పదేళ్లు, హరీష్ రావు ఐదేళ్లు నీరుపారుదల శాఖ ఉన్నప్పటికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు నీళ్లు కావాలని అడగలేదు.కేసీఆర్, ఆయన అల్లుడు బోగస్ మాటలు చెపుతున్నారని ఆ ఎమ్మెల్యేలకు తెలుసు. చిత్తం శివుడి మీద భక్తి చెప్పులపైన ఉన్నట్లు కేసీఆర్, హరీష్ రావు తీరు ఉంది.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్నదే కేసీఆర్, హరీష్ రావు ఆలోచన. సాగునీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్, హరీష్ రావుకు లేదు. ఖమ్మం సాగునీటి ప్రాజెక్టులపైన గతంలో నేను సమీక్ష చేశాను. తక్కువ ఖర్చుతో లక్షా ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని జిల్లా మంత్రులు చెప్పారు.

ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇస్తే..కృష్ణా జలాలపైన ఆధారపడే అవసరం ఉండదని తుమ్మల చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి రెండు వారాలకు ఒక సారి సమీక్ష చేసి, ప్రాజెక్టు నిర్మాణంలో శ్రద్ద చూపించారు. సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధాని మోదీ కి వివరించాం.

నేను, ఉత్తమ్ కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రిని స్వయంగా కలిశాం. దోపిడి బయటపడుతుందనే డీపీఆర్ లు పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టలేదు. డీపీఆర్ లు ఇవ్వకపోవడం వల్లనే కేంద్రం ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదు.అనేక చిక్కుముడులను విప్పుకుంటూ అనుమతులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాం.

మంత్రి తుమ్మల మాటను నమ్మి రైతులు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చారు. నాయకులతో పాటు రైతులు కూడా ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చారు. తొంభై శాతం పనులు మేం చేశామని హరీష్ రావు అంటున్నాడు. 4 వేల కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము గూడెం ప్రాజెక్టును అంచనా వేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ కి ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ ఏపీకి పోయింది. 1500 కోట్ల తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18 వేల కోట్లకు పెంచారు..

ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టుపైన కేసీఆర్ ప్రభుత్వం 7500 కోట్లు ఖర్చు చేసింది. 90 శాతం పూర్తి చేస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చెప్పాలి. క్రమ పద్దతిలో పనులు పూర్తి చేయలేదు. పంపులు, మోటార్లు తయారు చేయించి కమిషన్లు మెక్కారు. 4 యేళ్లుగా మోటార్లు ఇక్కడ పడి ఉన్నాయి. సమీక్ష చేసి కరెంటు కనెక్షన్లు ఇప్పించి మోటార్లు ఆన్ చేయించాం.ఆరునెలలు కష్టపడి పంప్ లు పనిచేసేలా చేశాం.

గోదావరి తల్లే మిమ్మల్ని తడిపి ఆశ్వీరదిందించింది. మా ఆలోచనలో స్వార్థం లేదు కాబట్టే అన్నీ సజావుగా జరిగాయి.గోదావరి జలాలను ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలనే స్వాతంత్ర్యం దినోత్సవం రోజు వచ్చాను. నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు మంత్రి పొంగులేటి నీళ్లు తెచ్చుకున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన నల్గొండ జిల్లా నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మా శ్రమను తగ్గించడానికి హరీష్ రావు ఒకటే మాట్లాడుతున్నాడు. తోక మాత్రమే మిగిలిందంటున్న హరీష్ రావు పదేళ్లు ఏం చేశారు? పదేళ్లు చేయలేని పనిని ఆరునెలల్లో చేశాం. మీ చెత్తబుద్ది తెలుసుకాబట్టే చెప్పుతో కొట్టారు..

ఖమ్మం జిల్లాలో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలేదు. అడవి పందుల్లా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది.కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా 6500 కోట్లు వడ్డీ కడుతున్నం. ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినప్పటికి ఖమ్మం ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నాం.

చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్, హరీస్ రావును పట్టించుకోం.కేసీఆర్ చెల్లని రూపాయి. తీరిక ఉన్నప్పుడు వచ్చి కేసీఆర్, హరీష్ రావు గోదావరి జలాలను చల్లుకోని పోవాలి. రెండు సీసాల్లో గోదావరి నీళ్లు కేసీఆర్ కు పంపించాలని మంత్రి తుమ్మలను కోరుతున్న.

LEAVE A RESPONSE