Suryaa.co.in

Telangana

మంత్రి వేములను కలిసి కేసిఆర్ కు దన్యవాదాలు తెలిపిన ఖాయితీ లంబాడాలు

వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మథుర ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన మథుర ఖాయితీ లంబాడాలు అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్వర్యంలో వీరంతా మంత్రిని కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న తమ సమస్యను గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. వీరంతా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలానికి చెందిన వారు.

LEAVE A RESPONSE