క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్న టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డి
– డోర్ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయిగాళ్లతో విషప్రచారం
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డి తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. డోర్ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ నటన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్రమోషన్లు, పింక్ డైమండ్ పేరుతో చేసిన అసత్య విషప్రచారమే..నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్నమ్మ ఉమామహేశ్వరి గారి మరణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారు.
తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేసిన నీచ చరిత్ర గలిగిన జగన్రెడ్డి, ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మర్డర్నీ వాడుకున్నారు. జనాన్ని దోచి దాచుకుని, నెత్తుటి కూడు తింటూ, తరతరాల రక్తచరిత్రకి వారసుడైన జగన్రెడ్డీ…చిన్నమ్మ మరణంతో మేము విషాదంలో వుంటే విషప్రచారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్పెయిరీ డేట్ దగ్గర పడింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు.