Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి రజనీ లెక్కలే వేరప్పా!

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గణితంలో పీజీ చదివినట్లున్నారు. అందుకే ఆమె చెప్పిన లెక్కలు, ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 56 కార్పొరేషన్లు తెచ్చిన ఘనత సీఎం జగనన్నదేనని, మంత్రి రజనక్క ప్రస్తుతించారు. బాగానే ఉంది. ఎందుకంటే.. ఇప్పటివరకూ అన్ని కార్పొరేషన్లు, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకటించలేదు కాబట్టి. అయితే.. 56 కార్పొరేషన్లకు 10 మంది డైరక్టర్ల చొప్పున నియమించారంటే, మొత్తం 600 మందికి అవకాశం ఇచ్చారని నోరుజారారు. దానితో 56×10=600 అంట.. అని నెటిజన్లు ట్రోలింగు షురూ చేశారు. మరికొందరు మాత్రం.. ఈ చిలకమ్మ కూడా ఫస్ట్‌క్లాస్ స్టూడెంటేనా? అని కామెంట్లు పెడుతున్నారు. ఏదో.. జగనన్నను పొగిడే ఉత్సాహంలో, మేడమ్ గారి లెక్క తప్పినట్లుంది. అంతమాత్రానికే మంత్రి గారి లెక్కల విజ్ఞానాన్ని తప్పుపడితే ఎలా?

LEAVE A RESPONSE