మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, విజయరామారావు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ మంత్రులు నివాళులర్పించారు. విజయరామారావు మరణవార్త తెలిసిన వెంటనే మంత్రులు ఆయన నివాసానికి వెళ్లి, భౌతిక కాయానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మల్యే మాగంటి గోపీ నాథ్ తదితరులు నివాళులర్పించారు. విజయరామారావు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, సానుభూతి వ్యక్తం చేశారు.