Suryaa.co.in

Telangana

125 అడుగుల అంబేద్కర్ విగ్రహ శిల్పిని సన్మానించిన మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెమొంటో అందజేసి, శాలువాతో సత్కరించిన మంత్రులు వేముల,కొప్పుల

హైదరాబాద్: 132వ జయంతి పురస్కరించుకుని హుస్సేన్ సాగర్ తీరాన నెలకొల్పిన డా. బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఘన ప్రారంభోత్సవం చేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ సందర్బంగా విగ్రహాన్ని రూపొందించిన విగ్రహ శిల్పి మహారాష్ట్రకు చెందిన అనిల్ సుతార్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఘనంగా సత్కరించారు. మేమొంటో అందజేసి,శాలువాతో సన్మానించారు. ఆయనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (ప్రధానశిల్పి రామ్ సుతార్ 100 ఏండ్లు పైబడిన పెద్ద మనిషి ఇవాళ్టి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారు)
ఈ సందర్బంగా ఆర్ అండ్ బి ఈ ఎన్సి గణపతి రెడ్డి,ఈ ఈ రవీంద్ర మోహన్, ఆర్కిటెక్ట్ జయ్ కాక్టికర్,కేపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్ కుమార్,కొండల్ రెడ్డి,వంశీ వర్ధన్ రెడ్డి తదితరులను ప్రభుత్వం తరుపున మంత్రులు సన్మానించి,అభినందనలు తెలిపారు.

ఆర్ అండ్ బి శాఖ అధికారులు, కేపీసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు కలిసి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,కొప్పుల ఈశ్వర్ లను శాలువాతో సన్మానించారు. తమకు విలువైన సూచనలు చేస్తూ,అందర్నీ సమన్వయం చేస్తూ తమకు అన్ని విధాల తోడ్పాటు,మనోధైర్యాన్ని ఇచ్చిన మంత్రులకు వారు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A RESPONSE