Suryaa.co.in

Telangana

బీజేపీలో చేరిన మైనారిటీలు

నాంపల్లి బిజెపి కార్యాలయంలో బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా నాయకత్వంలో మైనార్టీ చేరికలు జరిగాయి. ఇందులో భాగంగా అప్సర పాషా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీ అని, నరేంద్ర మోడీ గారిని చూసి చాలామంది మోడీ మిత్రులుగా మారుతున్నారు అని చెప్పారు. మోడీ పాలన మరియు మోడీ గారి పథకాలు చూసి చాలామంది మైనార్టీలు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బి.ఆర్.ఎస్ కి ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పారు.

ఇవాళ రాష్ట్రంలో మైనార్టీలను ఓట్ బ్యాంకులగా ఉపయోగించుకొని వారి అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. మైనార్టీలకు కూడా డబుల్ బెడ్ రూమ్, పెన్షన్ గాని ఇలాంటి పథకాలు అందలేదని విమర్శించారు, ఇవాళ భారతీయ జనతా పార్టీతోనే ఓల్డ్ సిటీ న్యూ సిటీగా చేస్తామని చెప్పారు.. ఇవాళ మైనార్టీలను కూడా భారతదేశ వాసి గా చూసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం సబ్కా వికాస్ సూపర్ విశ్వాస్ అనే నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుంది అని చెప్పారు. ఇవాళ సంజయ్ అన్న గారి నాయకత్వంలో వచ్చే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయదుందు మోగిస్తుందని చెప్పారు కొత్తగా చేరికల్లో అయినటువంటి వారిలో సమీ మొహమ్మద్ ఖాన్, రిదా కుదూస్, సయ్యద్ ఫరహాన్, మొహమ్మద్ మీరాజ్, సయ్యద్ కలిముద్దీన్, ఫారూఖ్ అహ్మద్ బట్, శ్రీధర్ రావు, మక్సుత్ పార్టీలో చేరడం జరిగింది వీరందరిని బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షులు అప్సర్ పాష కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, రాష్ట్ర కార్యదర్శి సైఫుల్ల ఖాన్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అలీ గుట్ మీ, ఆఫీస్ సెక్రటరీలు మహమ్మద్ పాషా, శంషుద్దీన్, పాలసీ అండ్ రీసెర్చ్ తౌసిఫ్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE