పరిగిలో శ్రీ కార్తీక కోటి దీపోత్సవములో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి దంపతులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కోటి‌ దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య గార్లు & స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply