Suryaa.co.in

Andhra Pradesh

బండారు సత్యనారాయణ, ఈనాడు,ఆంధ్రజ్యోతి tv5 పై పోలీసులకు ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు

– సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడు
– అయ్యన్న కొడుకుల మోసాలపై ఈ.డీ.కి ఫిర్యాదు చేస్తా
– మదురవాడు ఐటి సెజ్ దగ్గర ఏన్‌.సి.సి భూముల విషయంలో తనపై అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు, బండారు సత్యనారాయణ,పలువురి టిడిపి నాయకులపైన ఈనాడు,ఆంధ్రజ్యోతి tv5,మీడియా సంస్థలపై పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే…
చంద్రబాబు హయాంలోనే NCC భూముల లావాదేవీలు జరిగాయి.చంద్రబాబు..తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా…? కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు నాయుడే.చంద్రబాబు ఆల్జీ మర్స్ తో బాధ పడుతున్నారు.దేవుడు ఆయుష్హు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేయగలిగేది.
ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను చంద్రబాబు సామాజిక వర్గం ఆక్రమించింది.ఆ భూముల విలువ కనీసం 10వేల కోట్లు.భూముల అక్రమాలను సహించేది లేదు.భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటాం.

సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడు.అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయి.ఆయన ఇంటి పేరు చింత కాయ కాదు మిరపకాయలు.అయ్యన్న తాగితే మనిషి కాదు…రాత్రీ,పగలు తాగుతునే ఉంటాడు.అయ్యన్న, ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయి.

తండ్రి కొడుకు బెంగుళూరులో మోసాలకు పాల్పడ్డారు. అయ్యన్న కొడుకుల మోసాలపై ఈ.డీ.కి ఫిర్యాదు చేస్తాను.
టిడిపి ఆరోపణలు చేసిన జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీ మురళీ, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడు.జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీలో నా అల్లుడికి వాటాలు ఉన్నాయనేది అసత్య ప్రచారం.ఈ భూముల వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేని నా అల్లుడుని,నా కుటుంబాన్ని,తనకు,తన పార్టీపై ఆరోపణలు చేసిన టిడిపి నాయకులను ఎండగడతాను. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు.క్రిమినల్ , సివిల్ డిఫార్మేషన్ కేసులను న్యాయస్థానంను ఆశ్రయిస్తాం.

LEAVE A RESPONSE