Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీతో ఉన్నందుకే జగన్‌పై చర్యల్లేవు

-జగన్ అవినీతిపై మాట్లాడిన రాజ్‌నాధ్ ఎందుకు చర్యలు తీసుకోలేదు?
-మార్చి 1 న రాష్ట్ర అభివృద్ధి కోసం డిక్లరేషన్
-తిరుపతి వేదికగా హోదా పై డిక్లరేషన్
-ఇంటి ఇల్లాలు పేరుమీదే 5 వేలు పంపిణీ
-ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి

జగన్ అవినీతి చేస్తున్నాడు అని బీజేపీ కి తెలుసు. రాజ్ నాథ్ స్వయంగా ఆరోపణలు చేశారు. తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వాచ్ డాగ్ ఉన్న మీరు చర్యలు ఎందుకు తీసుకోరు ? అవినీతి జరుగుతుంటే చర్యలు ఏవి? జగన్ బీజేపీలో ఉన్నాడు. చర్యలు లేవు అంటే ఇదే సాక్ష్యం. బీజేపీ కి జగన్ బి టీమ్ కాదు..జగన్ ఉన్నది బీజేపీ లోనే.

అనంతపురంలో ఇచ్చిన గ్యారెంటీ సంక్షేమం కోసం అయితే మార్చి 1 న రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డిక్లరేషన్ చేయబోతున్నాం. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా పై డిక్లరేషన్ ఇస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా సాధన పై ఎవరికి చిత్తశుద్ది లేదు. రాజకీయం కోసం హోదా అంశాన్ని వాడుకున్నారు.

అధికారంలో వచ్చాక హోదా ఊసే ఎత్తలేదు. అనాడు 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ హోదా ఇచ్చింది. బీజేపీ 10 ఏళ్లు ఇస్తామని తిరుపతి వేదికగా మాట ఇచ్చారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా,అదే మైదానంలో డిక్లరేషన్ ప్రకటిస్తాం. చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగారు. అదే వేదికగా మోడీ 10 ఏళ్ల హోదా తో పాటు ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని హర్డ్ వేర్ హబ్ చేస్తామని మాట ఇచ్చారు. మోడీ రాష్ట్రాన్ని మోసం చేస్తే…ఇక్కడ ఉన్న పాలక పక్షం,ప్రతిపక్షం ఊడిగం చేస్తున్నాయి

హోదా పొందిన రాష్ట్రాలు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాయి. ఉత్తరాంఖడ్ రాష్ట్రంలో 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. 972 కిలోమీటర్ తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రం హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. హోదా సంజీవని కాకపోతే హోదా ఉన్న మిగతా రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందాయి ? హోదా వచ్చి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి. ఉపాధి అవకాశాలు ఉండేవి.

కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్ లు గా వచ్చేవి. కేంద్రం ఇచ్చే బడ్జెట్ లో 30 శాతం నిధులు వచ్చేవి. పన్ను మినహాయింపు దక్కుతుంది. దీంతో ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. ఆంధ్ర లో ప్రతి జిల్లా ఎంతో అభివృద్ధి చెందేది.ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందేది. ఇద్దరు ముఖ్యమంత్రుల పుణ్యమా అని హోదా వెనక్కు వెళ్ళింది.

జగన్ అన్న ప్రతిపక్షంలో ఉండి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 25 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదో చూద్దాం అన్నాడు. హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు.అధికారంలోకి వచ్చాకా మాట మార్చారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు…రాష్ట్ర హక్కులను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.

2019 లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.18శాతం మాత్రమే. అయినా వైఎస్సార్ బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే…కేవలం విభజన హామీల సాధన కోసమే. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హోదా పై చిత్తశుద్ది ఉంది. రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే కాంగ్రెస్ కి చిత్తశుద్ది ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారం రాగానే హోదా ఇస్తామని…మొదటి సంతకం పెడతామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రజలకు మంచి చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ కి అమ్ముడు పోయిన పార్టీలతో లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి భలం లేదు అని తెలిసినా కూడా బలమైన నిర్ణయం తీసుకున్న. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నిర్ణయం తీసుకున్న. ఇందిరమ్మ అభయం గొప్ప పథకం. పేదరికం నిర్మూలన కోసం,అసమానతలు తొలగించే పథకం. ఎంతో దూర దృష్టితో పథకం రూపకల్పన జరిగింది.

రాష్ట్రంలో పేదవారిని పట్టించుకొనే పరిస్థితి లేదు. పేదవాడు తింటున్నాడా? లేదా అని పట్టింపు లేదు. రాష్ట్రంలో పేదలు బ్రతుకే పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవల్ లో పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ పథకం రూపకల్పన చేశాం. ప్రతి నెల మహిళ పేరుమీదే 5 వేల చెక్కు పంపిస్తాం.

మహిళ అంటే ఒక త్యాగం. అందుకే ఇంటి ఇల్లాలు పేరుమీదే 5 వేలు పంపిణీ. వైఎస్సార్ హయాంలో సంక్షేమం,అభివృద్ధి రెండు సమానంగా జరిగాయి. అందుకే వైఎస్సార్ కోట్లమంది ప్రజల గుండెల్లో నిలిచాడు. రాష్ట్రంపై వైఎస్సార్ మార్క్ ఎవరు చెరపలేరు.

LEAVE A RESPONSE