Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలన లో రాష్ట్రానికి ఏ కంపెనీ రాదు

-జగన్ అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీ ని తెలంగాణ కి తరిమేశాడు
-ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పాలసీలు మార్చడం రాష్ట్ర భవిష్యత్తు కి మంచిది కాదు
-ఏపి బ్రాండ్ ని జగన్ దెబ్బతీశారు
-టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీడి కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం
-అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం
-ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కలి రాజన్న ఫ్యామిలీ డాబా వద్ద తటస్థ ప్రముఖులతో డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమం

జగన్ పాలనలో వేధింపులు తట్టుకోలేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
ప్రజలకు దేని మీదా హక్కు లేకుండా పోతుంది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నా భయపడుతున్నారు.
వెంకటగిరి నియోజకవర్గం లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది.
ఉపాధి దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
బీడి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబం మొత్తం కష్టపడితే రోజుకి రూ.500 కూడా రావడం లేదు.
వెంకటగిరి లో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు.
సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందడం లేదు. రకరకాల కండిషన్స్ పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు.
స్టార్ట్ అప్ కంపెనీలకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదు.
జగన్ పాలనలో ఇసుక రేటు ఆకాశాన్ని అంటుతుంది.
జగన్ లిక్కర్ పాలసీ వలన తాగుబోతులు రోడ్ల పై వీరంగం సృష్టిస్తున్నారు.
వెంకటగిరి నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. అది రాకపోగా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా రావడం లేదు.
వస్తున్న ఆదాయంతో పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా, వైద్య వ్యవస్థ లో మార్పులు తీసుకురావాలి.
జగన్ పాలనలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. -టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వెంకటగిరి నియోజకవర్గం తటస్థ ప్రముఖులు

ఈ సందర్భంగా లోకేష్ ఏమన్నారంటే…
అందరి సమస్యలు తెలుసుకుంటున్నాను.జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే.జగన్ ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదు.జగన్ పాలనలో సమాజంలో భయం ఉంది. పాదయాత్ర లో నన్ను కలిస్తే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానని వాలంటీర్లు బెదిరిస్తున్నారు.వెంకటగిరి కి చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లోకల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానికంగా ఐటి ఉద్యోగాలు కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీడి కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. వెంకటగిరి చేనేత కు చరిత్ర ఉంది. కానీ ప్రస్తుత మార్కెట్ కి తగ్గట్టుగా డిజైన్స్ ఉండాలి. దానికి తగ్గ నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మార్కెట్ లింక్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మంగళగిరి లో ఒక పైలట్ ప్రాజెక్టు చేస్తున్నాను. టాటా కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకొని, చేనేత కార్మికులకు సాయం చేస్తున్నాను. అది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
పట్టు రైతులకు కూడా జగన్ ప్రభుత్వం బకాయి పడింది.నూలు, రంగులు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పట్టు రైతులను ఆదుకున్నాం. చేనేత మగ్గాల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. వాటిని చేనేత కార్మికులు అందించాలి.
వెంకటగిరి చీరలు అమ్మ, బ్రహ్మణి కట్టుకుంటారు.వెంకటగిరి చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత నాది. టెక్స్ టైల్ పార్క్ తో వివర్స్ శాల అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి అనే ఆలోచన లో ఉన్నాం.
జగన్ పాలన లో రాష్ట్రానికి ఏ కంపెనీ రాదు. జగన్ అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీ ని తెలంగాణ కి తరిమేశాడు. అక్కడ 20 వేల మందికి ఉద్యోగాలు ఏపి యువత కోల్పోయారు. యూపి లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏపికి రావడానికి జగన్ ని చూసి భయపడుతున్నారు. ఏపి బ్రాండ్ ని జగన్ దెబ్బతీశారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాలి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పాలసీలు మార్చడం రాష్ట్ర భవిష్యత్తు కి మంచిది కాదు.
జగన్ పాలనలో వ్యాపారస్తుల పై బాదుడే బాదుడు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను , బోర్డు పన్ను అంటూ అనేక పన్నులు వేసి ఇబ్బంది పెట్టడం వలన చిరు వ్యాపారులు ఎవ్వరూ సంతోషంగా లేరు. గత ముఖ్యమంత్రులు ఎవరూ రాష్ట్రం పరువు తియ్యలేదు. జగన్ రాష్ట్ర పరువు తీశాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు.అధికారంలోకి వచ్చిన వెంటనే పీపిఏ లు రద్దు చేసి దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు తీశాడు.

జగన్ ఒక కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. కరెంట్ ఛార్జీలు పెంచేది ఆయనే…సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేది ఆయనే.ఉద్యోగాలు ప్రాతిపదికన కంపెనీలకు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలి అని నేను బలంగా నమ్ముతున్నాను.జగన్ ఇసుకను హాల్ సేల్ గా దొచేస్తున్నాడు. రోజుకి ఇసుక దోపిడి ద్వారా జగన్ ఆదాయం రూ.3 కోట్లు. నూతన ఇసుక విధానం తీసుకొచ్చి ఇసుక ధర తగ్గించి. అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం.

జే బ్రాండ్ లిక్కర్ బ్రాండ్ తాగితే పైకి పోవడం ఖాయం.జే బ్రాండ్ నకిలీ మద్యం ద్వారా జగన్ వేల కోట్లు దోపిడి చేస్తున్నాడు.జగన్ పాలనలో సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత లేదు.నీరు ఉన్నా సాగుకు నీరు ఇవ్వలేని దుస్థితి జగన్ పాలనలో ఉంది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రైతులను ఆదుకోవడానికి హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ, ఖర్జూరం, అంజుర్ లాంటి పంటల్లో వివిధ రకాల మొక్కలు అందుబాటులోకి తీసుకొస్తాం.

జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. అప్కోస్ తీసుకురావడం తప్ప జగన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఉద్దరించింది ఏమి లేదు.

టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత మీ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తాం. ఏపిపిఎస్సి ని యూపిపిఎస్సి తరహాలో బలోపేతం చేస్తాం.ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని భర్తీ చేస్తాం. జగన్ పాలనలో నాడు – నేడు అంటూ ప్రచార ఆర్భాటం తప్ప చిత్తశుద్ది లేదు. నూతన విద్యా విధానం అంటూ జగన్ స్కూల్స్ మూసేస్తున్నాడు. దీని వలన పిల్లలు విద్యకు దూరం అవుతున్నాడు. క్కువ మంది ఐఏఎస్, ఐపిఎస్ లు ప్రభుత్వ పాటశాలల్లో చదివిన వారే.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాలు ప్రక్షాళన చెయ్యాలి. ఫౌండేషన్ బాగుంటే స్కిల్ డెవలప్మెంట్ అవసరం పెద్దగా ఉండదు. జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిల్లో దుర్భరమైన పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.

జగన్ పాలనలో ఉపాద్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఉపాధ్యాయులను జగన్ లిక్కర్ షాపుల ముందు నిలబెట్టి అవమానించాడు. రకరకాల యాప్ లు పేరు చెప్పి ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. ఉపాధ్యాయుల పని కేవలం విద్యార్థులకు చదువు చెప్పడం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యాప్ ల భారం, వేధింపులు లేకుండా చేస్తాం. అంగన్వాడీ దగ్గర నుండి ఉన్నత విద్య వరకూ టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే బలోపేతం చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.

LEAVE A RESPONSE