Suryaa.co.in

Andhra Pradesh

175కు 175 సీట్లని అరవడం కాదు..కనీసం 175 మంది రైతుల్నైనా ఆదుకోండి

-ముందుచూపు లేని అసమర్థ ప్రభుత్వంతో రైతాంగానికి ఇబ్బందులు
-పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– అనగాని సత్యప్రసాద్

లక్షల రూపాయలతో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతుల్ని వర్షాలు నిండా ముంచాయి. ఓ వైపు పెట్టిన పెట్టుబడి గుదిబండగా మారినా.. మరో వైపు ప్రభుత్వం నుండి కనీస సహాయం అందకపోవటం బాధాకరం. ప్రభుత్వం మాటలు చూస్తే కోటలు దాటు తున్నాయి..చేతలు మాత్రం గడప దాటడం లేదు. తుపాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే అన్నదాతలు నష్టపోయారు. జగన్ రెడ్డికి రైతులన్నా, రైతు సమ్యసలన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.3వేల కోట్లతో దరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లత ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి ఈ ముఖ్యమంత్రి గుర్తులేదోమో. పంటలు వేసే ముందే ధరలు ప్రకటిస్తామన్నారు..ఎక్కడైనా క్షేత్రస్థాయిలో తిరిగి ధరలు నిర్ణయించారా.? ప్రకాశం, బాపట్ల, తూ.గో. ప.గో జిల్లాల్లో వరి, పత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.

కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు నీటమునిగాయి. రైతులు వర్షాలు, వరదలతో పంట నష్టపోయి కన్నీళ్లలో ఉంటే జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వదలి బయటకు రావటం లేదు. మరో వైపు వ్యవసాయశాఖా మంత్రి పేకాట క్లబ్లులు, కల్తీ మద్యం వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేక వరిసాగు చేయొద్దని మంత్రి వ్యాఖ్యానించడం చేతకాని తనానికి నిదర్శనం. ఎమ్మెల్యేలు ఎవరి దందాల్లో వాల్లు బిజీగా ఉన్నారు. రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత? వైసీపీ పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పుడు తుఫాన్ తో మరింత నష్టపోయారు. వరి, మిరప, మెక్కజొన్న, వేరుశనగ సాగు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కోత కోసి వరి ధాన్యాన్ని ఆరబోసుకున్నారు, మరి కొన్ని చోట్ల కోతకు సిద్ధంగా ఉన్నా వర్షాలతో పంటనేల వాలింది.

ముఖ్యమంత్రి చెప్పే గణాంకాలకు, వాస్తవాలకు పరస్పర విరుద్ధం. కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు సమకూర్చటం దగ్గర నుంచి అన్నదాతలకు అన్నీ సమస్యలే. టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కాటాలు,లోడదింగ్, హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరించేది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అవసరమైన పరదాలు కూడా టీడీపీ ప్రభుత్వం అందించింది..కానీ వైసీపీ వచ్చాక అన్నీ బంద్. 175కు 175 సీట్లని అరవడం కాదు..కనీసం 175 మంది రైతుల్నైనా ఆదుకోండి. పంట కొనుగోళ్లలో టీడీపీ హయాంలో 3 దశల్లో పూర్తైతే..నేడు జగన్ రెడ్డి 18 దశలు విధించారు.

LEAVE A RESPONSE