నరసరావుపేట: మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలం చాగంటి వారి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కొత్త లుక్ లో కనిపించారు. తలకు కండువా, పంచె కట్టుకొని చూపరులను ఆకర్శించారు. గోధుమ రంగు పట్టు పంచె లో ఆయన ‘పల్నాడు బ్రహ్మనాయుడు’ లా కన్పించారు. ఆయనలో తెలుగుదనం, పల్లె సంప్రదాయాలు స్పష్టంగా కన్పించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు కూడా పంచె కట్టుతో పాల్గొన్నారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి మాట్లాడుతూ రోహిణి నక్షత్రం నుండి జేష్ఠా నక్షత్రం లోకి ప్రవేశించే సమయంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం శుభ సూచిక మన్నారు. కాకతీయుల కాలంలో నాటినుండి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కూడా ఏరువాక కార్యక్రమాలు చేపట్టినట్టు సూచికలు ఉన్నాయన్నారు.
Devotional
శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు
ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…