కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికల్లో… భాజపా తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక TRS తన అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె, పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ… కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం స్రవంతితో పాటు.. స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ టికెట్ను ఆశించారు.