Suryaa.co.in

Andhra Pradesh

అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డే

– ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు సృష్టికి వైసీపీ యత్నం
– అన్ స్టాపబుల్ షో ద్వారానైనా రోజా, అంబటి వాస్తవాలు తెలుసుకోవాలి
-మాజీ స్పీకర్ ప్రతిభా భారతి

తెలుగుదేశం పార్టీలో ఆగష్టు సంక్షోభంపై ఇంతకాలం దుష్ప్రచారం చేస్తూ వచ్చిన వైసీపీ నేతలు.. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు గారు వాస్తవాలు చెప్పడాన్ని జీర్ణించుకోలేక అవాకులు, చవాకులు పేలుతున్నారు. ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేరని వైసీపీ నేతలు గుర్తించాలి. నాడు రామకృష్ణ స్టూడియోను ధ్వంసం చేయించారు. నేడు ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం పదవి కోసం తండ్రి శవం దొరక్కముందే రాజకీయాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డే. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడవడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీని కూడా నిలువునా మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం మంత్రులు పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారు. ఆనాడు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబుగారిని టార్గెట్ చేస్తూ ఇంతకాలం ప్రజలను పక్కదారి పట్టించారు. ఇకపై వారి ఆటలు సాగవు. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు వాస్తవాలను ప్రజలకు వివరించారు. రోజా తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అంబటి రాంబాబు, రోజా అన్ స్టాపబుల్ షో చూసి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి.

LEAVE A RESPONSE