Suryaa.co.in

Andhra Pradesh

ఆహారం, మంచినీరు సమయానికి అందించండి

– వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు సమయానికి ఆహానం, మంచినీరు అందించాలని కోరారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారంపైనా ఆరా తీశారు.

పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని, బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని, కమ్యునికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని సీఎం కోరారు. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని, రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమస్యను రెండుమూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు.

LEAVE A RESPONSE