Suryaa.co.in

National

ఆసుపత్రిలో చేరిన పంజాబ్​ సీఎం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆసుపత్రిలో చేరారు. కడుపు నొప్పి కారణంగా బుధవారం రాత్రి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని ఇద్దరు గ్యాంగ్‌స్టర్లపై ఆపరేషన్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను పంజాబ్ సీఎం అంతకుముందు రోజు అభినందించారు.

అమృత్‌సర్‌లోని భక్నా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుసా మరణించారని పోలీసులు తెలిపారు. గాయకుడు సిద్ధూ మూసె వాలా హత్యకేసులో వీరికి ప్రమేయం ఉందని అనుమానిస్తున్న ఈ ఇద్దరూ దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లు, సంఘ వ్యతిరేక శక్తులపై యుద్ధాన్ని ప్రారంభించిందని మాన్ అన్నారు.

LEAVE A RESPONSE