Suryaa.co.in

Andhra Pradesh

కోడుమూరు వైసీపీఎమ్మెల్యే సుధాకర్ అవినీతిని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధం

– కోడుమూరు వైసీపీఎమ్మెల్యే సుధాకర్ కి, దళితమంత్రులకు దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఇప్పడే గుర్తుకువచ్చాయా? సుధాకర్ అవినీతిని ఆధారాలతో నిరూపించడానికి తాముసిద్ధం. కేకలు, అరుపులుమాని ఎప్పుడు, ఎక్కడచర్చకు వస్తాడో ఆయనే చెప్పాలి : ఎం.ఎస్.రాజు
• డాక్టర్ సుధాకర్ మొదలు అచ్చెన్నవరకు దళితయువతను, మహిళల్ని జగన్, అతనిప్రభుత్వం దుర్మార్గంగా బలితీసుకున్నప్పుడు వైసీపీదళితఎమ్మెల్యేలు, దళితమంత్రులు ఎక్కడ దాక్కున్నారు?*
• సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి, చంద్రబాబు దళితులకోసం అమలుచేసిన 27పథకాల్ని రద్దుచేసినప్పుడు వీళ్లంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదు?
– కోడుమూరు యువగళం పాదయాత్ర ప్రదేశంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు, కోడుమూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ఆకుపోగు ప్రభాకర్

“ఎక్కడికక్కడ స్థానికసమస్యలను ఎత్తిచూపుతూ, ప్రజలకష్టాలను తెలుసుకుంటూ, అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాల్ని ఎండగడుతూ, బహిరంగంగా సవాళ్లు విసు రుతూ, టీడీపీయువనేత నారాలోకేశ్ యువగళంపాదయాత్ర సాగుతోంది. ప్రజలు హర్షాతి రేకాలు, జయజయధ్వానాలతో ఆయన్ని స్వాగతిస్తున్నతీరు చూస్తుంటే, ఈ దోపిడీ ప్రభు త్వంపై, జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలపై ఎంత ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారో అర్థమవుతోంది.

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ అవినీతిని ఆధారాలతో నిరూపించడానికి తాము సిద్ధం
కోడుమూరు వైసీపీఎమ్మెల్యే సుధాకర్ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలను లోకేశ్ బహిరంగ సభసాక్షిగా ప్రజలకు వివరించారు. ఆక్రమంలో సుధాకర్ పోలీసుల్ని అడ్డుపెట్టుకొని అంబేద్క ర్ మహానీయుడి విగ్రహంసాక్షిగా డ్రామాలు ఆడాడు. లోకేశ్ అనని మాటల్ని అన్నట్టుగా వక్రీ కరించడం, దుష్ప్రచారంచేయడం వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులకు అలవాటైంది. లోకేశ్ గారు ఏమన్నారో, ఏమి అనలేదో ఆధారాలతోసహా నిరూపించడానికి తాముసిద్ధం. సుధాకర్ అరుపులు, కేకలుమాని, పోలీసులు, అనుచరులులేకుండా ఎక్కడికి చర్చకు వస్తాడో రావొచ్చు. కోడుమూరు నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహంవద్ద అయినా, సుధాక ర్ఇంటివద్ద అయినా తాము ఆయన అవినీతిని, లోకేశ్ గారి వ్యక్తిత్వాన్ని నిరూపించడానికి సిద్ధం. ఎమ్మెల్యే సుధాకర్ అవినీతిచిట్టా మావద్దఉంది. కర్ణాటక మద్యం అమ్మకాలు, ఎకరం రూ.8నుంచి రూ.9కోట్లు విలువచేసే గంగమ్మ చెరువుభూమిని ఆక్రమించడం, విజయవాడ నుంచి వచ్చిన తనస్నేహితులతో ఆభూమిని ప్లాట్లుగామార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించడం, తన అనుచరులతో ప్లాట్లు అమ్మించడం, అంగన్ వాడీ పోస్టుల్లో చేతివాటం చూప డం వంటి ఎమ్మెల్యే బాగోతాల్ని ఒక్కొక్కటిగా నిరూపించడానికి లోకేశ్ సిద్ధం. మేం చెప్పినవిధంగా లోకేశ్ సవాల్ ను స్వీకరించే దమ్ము, ధైర్యం సుధాకర్ కు ఉందా?

బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా సుధాకర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని నిరూపించగలం. లోకే శ్ గారు ఏసందర్భంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిందిలేదు. దళితుల్ని కించపరిచింది లేదు. ఆయన అలాచేశాడని ఆధారాలతో నిరూపించే ధైర్యం సుధాకర్ కి ఉంటే , తమతో బహిరంగచర్చకు రావచ్చు. వైసీపీప్రభుత్వం విదేశీవిద్యపథకానికి అంబేద్కర్ పేరు తొలగించి, జగన్ పేరుపెట్టి, జగనన్న విదేశీవిద్యగా మార్చింది. దానిపై దళితనాయకుడు ఒకరు లోకేశ్ నుప్రశ్నిస్తే, ఆయన చాలాస్పష్టంగా సూటిగా సమాధానంచెప్పారు.

లోకేశ్ మాటల్ని వక్రీకరించి, రాక్షసానందం పొందడం కాదు…దమ్ముంటే బహిరంగచర్చకు రండి
చంద్రబాబు విదేశీవిద్యపథకం తీసుకొచ్చి, దానికి అంబేద్కర్ గారు పెట్టిందే, దళిత, గిరిజన, బీసీవర్గాల్లోని యువతలో స్ఫూర్తినింపడానికి అనిచెప్పారు. ఆయావర్గాల యువతీ యువకులు అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన్నిఆదర్శంగా తీసుకొని, కష్టపడిచదివి ఉన్నత స్థానాలకు రా వాలన్నదే చంద్రబాబుగారి కల అని లోకేశ్ చెప్పారు. అలానే అధికారంలోకి వచ్చిన 4ఏళ్లలో జగన్ దళితులకు ఏంపొడిచాడని విదేశీవిద్య పథకానికి ఆయనపేరు పెట్టు కుంటాడని కూడా లోకేశ్ గారు ప్రశ్నించారు. లోకేశ్ మాటల్ని వక్రీకరించి, దళితులు పీకింది.. పొడిచింది ఏమిటంటూ వైసీపీలోని దళితనేతలు, మంత్రులు, సాక్షిమీడియా దుష్ప్ర చారంచేస్తూ,రాక్షసానందం పొందుతున్నాయి. తానుఅన్నది ఏమిటో నిరూపించడానికి సిద్ధ మని, అనని దాన్నిఅన్నట్టుగా చిత్రీకరించినవారు ఎవరైనా బహిరంగచర్చకు వస్తారా అని లోకేశ్ సవాల్ విసిరితే, వైసీపీ, ఆపార్టీ పేటీఎంబ్యాచ్, సాక్షిమీడియా, ప్రభుత్వం తోకముడిచాయి. దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వైసీపీఎమ్మెల్యే సుధాకర్, దళితమంత్రులకు ఇప్పుడే గుర్తుకొచ్చాయా?డాక్టర్ సుధాకర్ మొదలు అచ్చెన్నవరకు దళితయువతను, మహిళల్ని జగన్, అతనిప్రభుత్వం దుర్మార్గంగా బలితీసుకున్నప్పుడు వైసీపీదళితఎమ్మెల్యేలు, దళితమంత్రులు ఎక్కడ దాక్కున్నారు?

దళితులఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, ఆదిమమానవ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు ఇప్పుడే గుర్తుకొచ్చాయా? డాక్టర్ సుధాకర్ ని జగన్ అతని ప్రభుత్వం బలితీసుకున్నప్పుడు వీళ్లంతా ఎక్కడ దాక్కున్నారు? అతని మరణానికి ప్రభు త్వం కారణమైననాడు సుధాకర్, సురేశ్ ఇతరదళితమంత్రులు ఎందుకునోరెత్తలేదు? తూర్పుగోదావరిజిల్లాలో వరప్రసాద్ అనే దళితయువకుడికి శిరోముండనంచేసినప్పుడు, మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో దళితయువకుడు కిరణ్ ను పోలీసులు కొట్టిచంపినప్పుడు, మాచర్లప్రాంతంలో విక్రమ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి హత్యచేసినప్పుడు, నెల్లూరులో ఉదయగిరి నారాయణను వైసీపీనేతలు చిత్రహింసలకు గురిచేసి, అతనిచావుకి కారణమైన ప్పుడు వైసీపీలోని దళితఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడున్నారు? వైసీపీ ఎమ్మెల్సీ తనవద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, శవాన్ని డోర్ డెలివరీచేసినప్పుడు మంత్రి సురేశ్, ఎమ్మెల్యే సుధాకర్ కు దళితుల ఆత్మగౌరవం గుర్తుకురాలేదా? మద్యంధరల పై ప్రశ్నించిన ఓంప్రతాప్ ను మంత్రిపెద్దిరెడ్డి అనుచరులు, పోలీసులుకలిసి అతికిరాతకంగా చంపేసినప్పుడు మంత్రులు ఆదిమూలపుసురేశ్, మేరుగనాగార్జున, వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు ఏ కంతలో దాక్కున్నారు?

పులివెందులలో జగన్ ఇంటికి కూతవేటు దూరంలో నాగమ్మ అనే దళితమహిళపై హత్యాచారంచేస్తే, ముఖ్యమంత్రి మృతురాలి కుటుంబాన్ని కూడా ఎందుకు పరామర్శించలేదు. రేపల్లే రైల్వేస్టేషన్లో నిండుగర్భిణిపై అత్యాచారం జరిగిన నాడుకూడా ముఖ్యమంత్రిలో చలనంలేదు. ఉన్నతాధికారిగా ఉన్న డాక్టర్ అచ్చెన్నను వేధిం పులతో బలితీసుకున్నప్పుడు, మంత్రిసురేశ్ ఎందుకు చొక్కావిప్పలేదు?
లోకేష్ దళితులకు ఎందుకు క్షమాపణలు చెప్పాలో సమాధానంచెప్పు సుధాకర్? వైసీపీప్రభుత్వ, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు, అరాచకాలకు బలైన దళితయువతీ యువకు ల్ని, వారికుటుంబాలను ఆదుకున్నందుకా? వైసీపీఎమ్మెల్సీ చంపేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం చేసి ఆదుకున్నందుకు చెప్పాలా? వైసీపీనేతలు కావలిలో కరుణాకర్ అనే దళితుడిని చంపేస్తే, అతనికుటుంబాన్నిఆదుకున్నందుకా? కరుణా కర్ చావుకి కారకులైన వైసీపీ నేతలపై పోరాటం చేసి, వారితాకట్టులో ఉన్నఇంటిని రూ.15 లక్షల సొంతడబ్బుతో విడిపించి, మృతుడికుటుంబానికి అండగా నిలిచినందుకా? వైసీపీలోని దళితనేతలకు, మంత్రులకు నిజంగా సిగ్గుందా? వారికి నిజంగా ఆత్మాభిమానం, ఆత్మగౌ రవం ఉంటే, వారిలో ప్రవహించేది నిజంగా దళితుల రక్తమేఅయితే తక్షణమే పదవులకు రాజీనామాలు చేసి, దళితులకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయంపై పోరాడాలి.

డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రజలముందు వేదికపై నిలబెట్టినప్పుడే దళితుల్ని జగన్ ఎంతగౌరవిస్తున్నాడో అర్థమైంది. డిప్యూటీ సీఎంని గౌరవించని ముఖ్యమంత్రి, దళితుల్ని ఉద్ధరిస్తాడా? తిరుపతిలో ప్రభుత్వ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి వేదికపై కూర్చుంటే, డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి చేతులుకట్టుకొని నిలబడటమేనా వైసీపీప్రభుత్వంలో దళితులకు లభిస్తు న్న ఆత్మగౌరవం? డిప్యూటీసీఎంకు గౌరవం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, దళితులఆత్మగౌరవాన్ని కాపాడతాడా? మేం ధైర్యంగా లోకేశ్, చంద్రబాబుగారితో మాట్లాడి, దళితులసమస్యల్ని నేరుగా వారితో మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
నేను లోకేశ్ తో కలిసి భోజ నం చేశానని గర్వంగా చెప్పగలను. నాలాగా వైసీపీలోని దళితఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరై నా జగన్మోహన్ రెడ్డితో ఆయనకుసరిసాటిగా పక్కన కూర్చోగలరా అనిప్రశ్నిస్తున్నా?

ఎమ్మెల్యే సుధాకర్ అరుపులు, కేకలకు అదిరేదిలేదు.. బెదిరేది లేదు. సుధాకర్ అవినీతికి సంబంధించి లోకేశ్ చెప్పిన ప్రతిదానిపై బహిరంగచర్చకు మేంసిద్ధం. సుధాకర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. సుధాకర్ తో చర్చకు లోకేశ్ గారు అవసరంలేదు…కోడుమూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ప్రభాకర్ అయినా, నేనైనా రెడీ. సమయం, స్థలంచెప్పమని సుధాకర్ ని సవాల్ చేస్తున్నాం. రజనీకాంత్ జనంమెచ్చిన సూపర్ స్టార్.. మీ నాయకుడిలా జైలుస్టార్ కాదని తెలుసుకో సుధాకర్ . తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భారతదేశం గర్వించదగ్గ నటుడు, అలాంటి వ్యక్తిని కూడా విమర్శించేంతటి గొప్పవాడివా సుధాకర్ నువ్వు? నువ్వు, నీపార్టీఎమ్మెల్యేలు, మంత్రులు రజనీకాంత్ కాలిగోటికి కూడా సరిపోరు. రజనీకాంత్ మీ నాయకుడిలా జైలుస్టార్ కాదు.. అవినీతిస్టార్ కాదు. రజనీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డిని, ఆయనప్రభుత్వ విధానాల్ని ఎక్క డా ఏమీ అన్నదిలేదు. అదికూడా గ్రహించకుండా ఇష్టానుసారం ప్రపంచంగర్వించే నటుడిపై విమర్శలుచేస్తారా? సుధాకర్ కు నిజంగా సిగ్గు,శరం, ఆత్మాభిమానముంటే తనకు అన్యాయం జరిగేచోట పోరాడాలి. ఆయన అవమానాలు భరిస్తూ ఎందుకు బతుకతున్నాడో ఆయనకే తెలియాలి. జగన్ ఎస్సీకార్పొరేషన్ నిర్వీర్యంచేసినా, సబ్ ప్లాన్ నిధులుదారిమళ్లిం చినా, దళితులపై దమనకాండ జరుగుతుంటే నోరెత్తలేని మీరు దళితుల్ని ఉద్ధరిస్తారా? లోకేశ్ గారిపై సుధాకర్ లాంటి బచ్చాలు, సాక్షిమీడియా, వైసీపీప్రభుత్వం ఎంతగా దుష్ప్రచా రంచేసినా, ఎన్నికట్టుకథలు అల్లినా ప్రజలునమ్మరని తెలుసుకోండి.”

జగన్ దృష్టిలో పడటానికే ఎమ్మెల్యే సుధాకర్ వీరంగం వేశాడు. : ఆకుపోగు ప్రభాకర్
“కోడుమూరులో లోకేశ్ గారు చెప్పినవాటికి మేం కట్టుబడిఉన్నాం. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటానికే నిన్న వీరంగం వేశాడు. జగన్ ప్రభుత్వంలో చొక్కాలు విప్పితే అసెంబ్లీకి, ప్యాంట్లు విప్పితే పార్లమెంట్ కు పంపించే పరిస్థితులు. అందుకే సుధాకర్ నిన్న అంబేద్కర్ గారి విగ్రహంసాక్షిగా, తప్పుడుమాటలు మాట్లాడి తనపరువు తానే రోడ్డునపడేసుకున్నాడు. జిల్లాకేంద్రంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో తనను అవమా నించిన అధికారుల్ని, సొంతపార్టీవారిని ప్రశ్నించలేని సుధాకర్, టీడీపీయువనేత లోకేశ్ గారి పై విమర్శలుచేయడం సిగ్గుచేటు. లోకేశ్ గారు ఎవరినీ, ఏమీ అనకపోయినా, ఏదో అన్నట్లు తప్పుడువీడియోలతో దుష్ప్రచారంచేయడం వైసీపీవారికి బాగా అలవాటైంది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ అనవసరమాటలు మాట్లాడటం ఆపేసి, లోకేశ్ గారి సవాల్ పై బహిరంగ చర్చకు రావాలి. తనఅన్నను అవమానించి ఇంటినుంచి వెళ్లగొట్టిన సుధాకర్ దళితుల అవ మానాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సుధాకర్ తనను అవమానించాడని ఆయన అన్నయ్యే మావద్దకు వచ్చివాపోయాడు.

తనకు మరలా ఎమ్మెల్యే టిక్కెట్ రాదనే సుధాకర్ పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాడు
తనకు మరలా టిక్కెట్ రాదనే సుధాకర్ పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాడు. సుధాకర్ మరలా ఎమ్మెల్యే కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకొచ్చు.. ఇంకా వీలైతే ఆయన భార్య భారతిరెడ్డి బట్టలు ఉతకొచ్చు. అంతే గానీ లోకేశ్ గారిపై, టీడీపీనేతలపై అవాకులు, చవాకులుపేలితే దవడలు వాయగొడతాం. 4ఏళ్లు ఎమ్మెల్యేగాఉన్న సుధాకర్ గానీ, ప్రభుత్వంలోని దళితమంత్రులు, ఎమ్మెల్యేలు దళితులపై జగన్ సాగిస్తున్న దమన కాండను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు. సీబీఐ, ఈడీకేసుల భయంతోనే మంత్రి సురేశ్ బట్టలిప్పి తిరిగాడు. నాయకుడి దారిలోనే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు నడుస్తు న్నారు. జగన్మోహన్ రెడ్డి దళితులవిషయంలో మేకవన్నె పులిలా ప్రవర్తిస్తున్నాడని దళిత సమాజానికి అర్థమైంది. సుధాకర్ తనస్థాయిని గుర్తుంచుకొని మాట్లాడాలి. లోకేశ్ గారు, చంద్రబాబుగారిని అనేంత స్థాయి నీకులేదని తెలుసుకో సుధాకర్. దళితులకు నువ్వు, నీ ప్రభుత్వం 4ఏళ్లలో ఏంచేసిందో చెప్పుసుధాకర్. దళితసంక్షేమానికి చంద్రబాబు వేల కోట్లు ఖర్చుపెట్టారని గర్వంగా చెప్పగలను. సుధాకర్ హద్దులుమీరి మాట్లాడితే ఎలాసమాధా నంచెప్పాలో మాకుబాగా తెలుసు.”

LEAVE A RESPONSE