Suryaa.co.in

Telangana

రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

డిప్యూటీ సీఎం, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యంలో మంత్రులు పర్యటనలు
ఉమ్మడి పది జిల్లాల్లో వర్క్ షాప్ లు

హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది.

ఈ కమిటీ ఈనెల 10వ తేదీ నుంచి .. 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే రైతు భరోసా కు నిధులు చెల్లిస్తాం. అందుకే ప్రజా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను మధించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది.

 

LEAVE A RESPONSE