Suryaa.co.in

Telangana

రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తోంది ముమ్మాటికీ సీఎం కేసీఆరే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

నిన్న రాత్రి కర్మన్ ఘాట్ లో గోరక్షక్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. తల్వార్లు, ఐరన్ రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గోవధ నిషేధం ఉన్న ఈ దేశంలో యధేచ్చగా గోవులను కబేళాలకు తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక కార్యకర్తలపై దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గోవులను రక్షించడం కోసం గోరక్షక కార్యకర్తలు కూడా తల్వార్లు, ఐరన్ రాడ్లతో గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితిని తీసుకొస్తారా?

నిన్న రాత్రి కర్మన్ ఘాట్ లో తల్వార్లతో స్వైర విహాహర చేసిన వాళ్లంతా రోహింగ్యాలేనని మావద్ద సమాచారం ఉంది. రాష్ట్రంలో రోహింగ్యాలే లేరని చెబుతున్న సీఎం మరి దుండగులను ఎందుకు దాస్తున్నట్లు? రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తోంది ముమ్మాటికీ సీఎం కేసీఆరే.హిందూ యువకులు, గోరక్షక కార్యకర్తలపై దాడి చేసిన వాళ్లను పట్టుకోవాల్సింది పోయి దాడులు చేయిస్తారా? తక్షణమే దాడులకు పాల్పడ్డ రోహింగ్యాలను అరెస్ట్ చేయాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తాం.

LEAVE A RESPONSE