Suryaa.co.in

Andhra Pradesh

బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు!

– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

రాష్ట్రంలో వైసిపి ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసిపినేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసిపి మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయి. జలగన్న పాలనలో అంబేద్కర్ రాజ్యంగం, చట్టాలకు విలువలేదు. వైసిపి దొంగలకు తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయడమే!

LEAVE A RESPONSE