Suryaa.co.in

Andhra Pradesh

మంత్రులతో సవితమ్మ భేటీ

అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత  భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఆయా మంత్రుల కార్యాలయాల్లో మంత్రులు గొట్టిపాటిని, బాలవీరాంజనేయులను మంత్రి సవితమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులతో సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రి సవితమ్మ చర్చించారు.

LEAVE A RESPONSE