Suryaa.co.in

Andhra Pradesh

నా చావు కోసం ఎదురుచూస్తున్నారు

– నేనే పోతే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు
– నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వాల్సిందే
– నా గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవు
– తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లిగూడెం: తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు.

తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని ఆరోపించారు. తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవని.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్ తోనే తాను గెలిచానని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని, ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ఆధారపడలేదని చెప్పారు. నియోజకవర్గంలో అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించేది లేదని బొలిశెట్టి హెచ్చరించారు.

అలాంటి వారి నుంచి అధికారులను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. “నేను పోయాకే మీరు ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను” అంటూ తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి స్థలాలు, పొలాలు కబ్జా చేయలేదని, కేవలం తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
తాను తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని, అయితే శాసనసభ్యుడిగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూటమిలోని మిత్రపక్ష నాయకులు ఇవ్వాలని బొలిశెట్టి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE