– కాంగ్రెస్ జరుగుతున్న సర్వేలలో కొరవడిన పారదర్శకత
– కులగణన నిర్వహణపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
– కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఢిల్లీ: తదుపరి చేపట్టబోయే జాతీయ జనాభా లెక్కల సేకరణతో పాటే కులాల వివరాలను కూడా సేకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
అధికారిక జనాభా గణాంకాల సేకరణ ప్రక్రియలోనే, కులాల వారీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చేపడుతున్న కులాల సర్వేలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలలో పారదర్శకత కొరవడిందని కేంద్రం అభిప్రాయపడినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.