Suryaa.co.in

Telangana

శహభాష్…శ్రీధర్

-నల్లగొండ నుంచి కరీంనగర్ వరకూ ఏక్తాయాత్రకు సైకిల్‌పై వచ్చిన కటకం శ్రీధర్
-మండుటెండలు సైతం లెక్కచేయని చిత్తశుద్ధిపై సంజయ్ ఆశ్చర్యం
-హిందుత్వం కోసం కష్టపడుతున్నావంటూ శ్రీధర్‌కు సన్మానం

హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా చర్లపల్లి నుండి సైకిల్ తొక్కుతూ కరీంనగర్ కు చేరుకున్న కటకం శ్రీధర్ అనే కార్యకర్త కొద్ది సేపటి క్రితం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసిన ద్రుశ్యం. ఎండాకాలంలో అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ రావడంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన బండి సంజయ్ హిందుత్వం కోసం కష్టపడుతున్నవంటూ శాలువా కప్పి అభినందించారు.

LEAVE A RESPONSE