Suryaa.co.in

Telangana

వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు

– వరి కొనబోమని చెప్పే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..?
– బంగారు తెలంగాణ అన్నారు. రైతులకు బతుకే లేకుండా కేసీఆర్ పాలన చేస్తున్నాడు
– రా రైస్ కొంటారా..బాయిల్డ్ రైస్ కొంటారా..అది మీ తలనొప్పి
– భారమంతా రైతుల మీద మోపడమేంటి..?
– కేసీఆర్ రైతు వ్యతిరేకి
– నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇదే గ్రామంలో నిరాహార దీక్ష చేస్తా
– YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల
వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. దిగుబడి సరిగా రాక, కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దని అనడంతో రవికుమార్(40) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. శనివారం మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ గ్రామంలోని రవికుమార్ (40) కుటుంబ సభ్యులను YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పరామర్శించి మాట్లాడారు. అనంతరం రవికుమార్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దీక్షలో కూర్చున్నారు.
‘‘ఎప్పుడు ఏ కాలం ఉంటుందో తెలియదు. ఎప్పుడు వానలు వస్తాయో తెలియదు. విత్తనాలు, ఎరువులు దొరుకుతయో..దొరకవో…తెలయదు. పంట బాగా పండుతదో పండదో తెలియదు. ఆకరికి లాభం వస్తుందో

నష్టం వస్తుందో కూడా తెలియదు. అయినా కూడా రైతు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తాడు. అంత గుండెనిబ్బరం ఉన్న రైతు గుండె బద్దలయ్యేలా, గుండె ఆగిపోయేలా కేసీఆర్ పాలన ఉంది. పొలాల్లో వడ్లు పండించాల్సిన రైతు ఈ రోజు ఎందుకు ఉరివేసుకుంటున్నాడు..?
నాట్లు వేసుకోవాల్సిన రైతు నడిరోడ్డున ఎందుకు పడ్డాడు..? కేసీఆర్ నియంత పాలనతో రైతులు ఆగమైపోతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక వరి కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వరి వేయవద్దని కేసీఆర్ చెబుతున్న మాటలకు అప్పులెలా తీర్చుకోవాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థంకాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
30మందికి పైగా రైతుల ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో చిన్న బీర్లయ్య వరి కుప్పపైనే కుప్ప కూలి పోయాడు. కామారెడ్డి జిల్లాలో రాజయ్య ఆ కుప్పల మీదే చనిపోయాడు. ములుగు కుమార్ ఇక ప్రభుత్వం వడ్లు కొనేలా లేదని పురుగుల మందు తాగి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా అయిలయ్య కూడా వడ్లు కొనేలా లేరని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వానాకాలం వడ్లు కొనకపోవడం, యాసంగి వరి వేయవద్దని చెప్పడంతో దాదాపు 30మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న రవికుమార్ అన్న కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో రవికుమార్ అన్న రాసిన మాటలు చూస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది.
రవికుమార్ అన్న లేఖలో ‘‘నా పొలంలో వరి తప్ప మరే పంట పండదు. వరి వేసుకోవద్దని అంటున్నారు. ఇదివరకే వరి వేసుకున్నా…పెట్టుబడి ఎక్కువైంది. ఉత్పత్తి తక్కువ వచ్చింది. నష్టాలపాలయిపోయా.. తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చి వరి వేసుకుందామని అనుకుంటే కేసీఆర్
sharmila1గారు వరి వేసుకోవద్దని అంటున్నారు. వరి వేయకపోతే నేను ఇంకేం వేయాలి. నేను నా భూమిలో వేరే పంట వేసే పరిస్థితి లేదు. వరి వేసుకోకపోతే ఇక నేను ఉరి వేసుకోవాలి. ఇంకేం చేయగలను’’ అంటూ బాధపడి రాసాడు.
రైతు తన భూమిలో వరి పండుతుందని, మద్దతు ధర ఉందని వరి వేస్తాడు. రైతు హక్కు మద్దతు ధర. మద్దతు ధర అంటే… మీరు ఈ పంట పండించండి ప్రభుత్వం ఈ ధరకు కొనుగోలు చేస్తుందని రైతుకు భరోసాను కల్పించాలి. మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ నిచ్చిన తర్వాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..? ఒక సారి రైతులకు హామీనిచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా..?
పంట పండించడం వరకే రైతు బాధ్యత. ఆ పంటను కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా..? ఆకరి గింజ వరకు కొంటామని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కొనుగోలు చేయబోమని రైతులను మోసం చేస్తున్నాడు. వరి కొనబోమని చెప్పే హక్కు మీకు ఎక్కడిది..? రైతు పండించిన పంటకు మద్దతు ధర ఉంది కనుకనే కదా వారు ధైర్యంగా ఆ పంటను సాగుచేసేది. ప్రభుత్వాలే మాట తప్పడంతో రైతులు ఉరివేసుకోవాల్సి వస్తోంది. ఇందుకేనా కేసీఆర్ ను సీఎం చేసింది.
బంగారు తెలంగాణ అన్నారు. రైతులకు బతుకే లేకుండా కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారు. ఇది న్యాయమేనా..? వానాకాలం వడ్లతో పాటు యాసంగి వడ్లు కూడా కేసీఆర్ కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలి. ఆ తర్వాత మీరు రా రైస్ చేసుకుంటారా..బాయిల్డ్ రైస్ చేసుకుంటారా…బంగారం చేసుకుంటారా మీ ఇష్టం. మీరు ఇక్కడ అమ్ముకుంటారా…బయట దేశాల్లో అమ్ముకుంటారా అన్నది మీ తలకాయ నొప్పి. అన్ని బాధ్యతలు తీసుకొచ్చి రైతు మీద వేస్తే రైతు ఏమిచేస్తాడు.
వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు. ఇది ఒక నినాదం కావాలి. ఆత్మహత్యకు పాల్పడిన రవికుమార్ కుటుంబ సభ్యులను కలిసాం. చాలా దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. రవికుమార్ అన్న భార్యకు గుండెనొప్పి ఉంది. తల్లిదండ్రులు వృద్ధులు. రవికుమార్ ఇద్దరికీ కూడా పింఛన్ రాదు. రవికుమార్ అన్నకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఒక బిడ్డ పెండ్లి చేసాడు. ఇంకో బిడ్డ చదువుకుంటోంది. కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిమా ఫాలింగ్ వ్యాధి వల్ల రక్తం వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదు. ఆ అబ్బాయికి మెడికల్ కర్చు చాలా అవుతుంది.
రవికుమార్ కుటుంబానికి దాదాపు రూ.50 లక్షల వరకు అప్పులే ఉన్నాయి. వరి వేసుకోవద్దంటే ఇంకో దారి మాకు లేదని రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు. కేసీఆర్ చేసిన హత్యే. కేసీఆర్ రైతు వ్యతిరేకి. రైతు వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్. ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది.
ఇంత వరకు కలెక్టర్ రాలేదు. ఎమ్మెల్యే వచ్చిందంట. బిక్షమేసినట్టు 10000 రూపాయలు ఇచ్చారు. ఇదేమైనా మెహర్వానీ అనుకుంటున్నారా..? ఆ కుటుంబాన్ని చూసుకుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? రవికుమార్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా. కలెక్టరే వస్తాడో, ఎమ్మెల్యే వస్తుందో..ఎవరు నష్టపరిహారం ఇస్తారో ఇవ్వండి. రవికుమార్ అన్న కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇదే గ్రామంలో కూర్చుని నిరాహార దీక్ష చేస్తా’’.

LEAVE A RESPONSE