Suryaa.co.in

Telangana

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి

– కేంద్ర మంత్రి పరుశోత్తం రూపాల
– కాంగ్రెస్ వి తాటాకు చప్పుళ్లు, ఇప్పటికీ బీజేపీయే బలంగా ఉంది
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉదృతం చేయాలని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి పరుషోత్తం రూపాల బిజెపి నాయకులకు సూచించారు. మెదక్, జహీరాబాద్ లోక్ సభ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికీ బిజెపి మాత్రమే బలంగా ఉందని, కాంగ్రెస్, బీ కేవలం సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కేవలం బిజెపి మాత్రమే పోరాడిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రూపాల దిశ నిర్దేశంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు, పార్టీ కార్యదర్శి జయశ్రీ, లోక్సభ ఇన్చార్జి బద్దం మహిపాల్ రెడ్డి, కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రవికుమార్ గౌడ్, రజనీకాంత్ తోపాటు పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE