– డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
– బీసీ ఉద్యమకారుడు, సామాజికవేత్త డా. వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరిక
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, అనంతరం రెండోసారి హయాంలో బీసీ కమిషన్ చైర్మన్గా సేవలందించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో బిజెపిలో చేరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్ రావు కండువా కప్పి స్వాగతించి, ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ , రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ , రామరావ్ పాటిల్ , డా. పాల్వాయి హరీష్ బాబు , సూర్యనారాయణ గుప్తా , మాజీ ఎంపీ సీతారాం నాయక్ , మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు నిజమైన న్యాయం చేయగల పార్టీ బీజేపీ మాత్రమే. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను మతపరమైన ముస్లిం రిజర్వేషన్లుగా మార్చే రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకునేది కూడా బీజేపీ మాత్రమే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారికంగా జనగణనతో పాటు కులగణన చేపట్టబోతున్న ఏకైక పార్టీ బీజేపీ. నిజమైన సామాజిక న్యాయానికి పునాదులు వేస్తున్న బీజేపీలో చేరడం ప్రజలకు నిజాయితీతో సేవ చేసే అవకాశం వస్తుందనే నా విశ్వాసం” అని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
డా. వకుళాభరణం మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం తప్పులు చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తోంది అని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ కూడా ఈ అంశంలో నిజమైన చిత్తశుద్ధి చూపలేదని తెలిపారు. బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదనే నమ్మకంతోనే తాను పార్టీలో చేరినట్టు స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అత్యవసర సమావేశం నిమిత్తం ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చినా, ఉదయం ప్రత్యేకంగా కలసి డా. వకుళాభరణం కి శాలువా కప్పి అభినందించారు. ఈ నెల 3న కరీంనగర్లో జరగనున్న పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరై, శ్రేణులకు పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారని డా. వకుళాభరణం తెలిపారు.
ఈ సందర్భంగా… డా. వకుళాభరణం బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన విషయాలను రాజ్యసభ సభ్యుడు డా.కెలక్ష్మణ్ గుర్తుచేశారు. బిజెపి ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని యావత్ బీసీ సమాజం అంతా నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసంతో ఉందని లక్ష్మణ్ అన్నారు.
మేధావులు, సామాజిక వర్గాలు బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వరుసగా పార్టీలో చేరుతున్నారని, ముఖ్యంగా కృష్ణమోహన్ చేరిక పార్టీకి శక్తివంతమైన అస్త్రం అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.